కేంద్రంలోని డబుల్ ఇంజిన్ సర్కారు పని అయిపోయిందని, కర్ణాటకలో ప్రజలు బీజేపీకి తగిన బుద్ధి చెప్పారని, సౌత్ ఇండియాలో స్థానం లేదని ఆదిలాబాద్-నిర్మల్ జిల్లాల కో-ఆర్డినేటర్, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ పేర్కొన్నారు. ఆదివారం ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో జరిగిన 12 వార్డుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే జోగు రామన్న, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గంగాధర్గౌడ్ మాట్లాడుతూ.. మతం పేరిట బీజేపీ నాయకులు ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. జూన్ 2 నుంచి జరిగే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. తొమ్మిదేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం నాలుగు లక్షల కోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని, దేశంలో ఏ పార్టీకి లేని విధంగా బీఆర్ఎస్కు 60 లక్షల సభ్యత్వం ఉందని పేర్కొన్నారు.
– ఆదిలాబాద్, మే 28(నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్, మే 28(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని, తొమ్మిదేండ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ సూచించారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 21 ఆ త్మీయ సమ్మేళనాలు జరిగాయని, ఈ కార్యక్రమంలో ద్వారా 30 వేల మందికి బీఆర్ఎస్ శ్రేణులను కలుసుకునే అవకాశం లభించిందన్నారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్కు 50 వేల సభ్య త్వం ఉందని, ప్రతి కార్యకర్త పార్టీ విజయానికి సైనికుల్లా పనిచేయాలని కోరారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని, 40 ఏండ్లుగా ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమి లేదన్నారు.
ఆ పార్టీ నాయకులు వార్డుల్లోకి వచ్చినప్పుడు వారు చేసిన అభివృద్ధిని ప్రశ్నిచడంతోపాటు హామీలపై నిలదీయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి ఎలాంటి నిధులు మంజూరు చే యలేదని తెలిపారు. జిల్లాకు సరిహద్దులో ఉన్న మహారాష్ట్రలో తెలంగాణ మాదిరి పథకాలు ఏ ఒక్కటీ అమలు కావడం లేదన్నారు. కేంద్రంలో బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారు పని అయిపోయిందని, కర్ణాటకలో ప్రజలు ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పారన్నారు. సౌత్ ఇండియాలో బీజేపీకీ స్థానం లేదని, మతం పేరిట బీజేపీ నాయకులు ప్రజలను మభ్యపెడుతున్నారని పేర్కొన్నారు. జూన్ 2 నుంచి జ రిగే తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.
కేంద్రం వైఫల్యాలు తెలియజేయాలి.. : జోగు రామన్న,ఎమ్మెల్యే
దేశంలో తొమ్మిదేళ్ల బీజేపీ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. 2014లో రూ.400 ఉన్న సిలిండర్ ధర ఇప్పడు రూ.1200కు పెరిగిందని, పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరకుల ధరలు ఆకాశానంటాయన్నారు. పెరిగిన ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆత్మీయ సమ్మేళనం తర్వాత బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బీజేపీ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. ధరల పెరుగుదలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కారణమనే విషయాన్ని వివరించాలని సూచించారు.
సీసీఐని ఎందుకు ప్రారంభించడం లేదు : దండె విఠల్, ఎమ్మెల్సీ
మూతపడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు ప్రారంభించడం లేదని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. మోదీ ప్రభుత్వం సీసీఐని ప్రారంభించాలని ప్రజలు, భూ నిర్వాసితులు, అఖిలపక్షం నాయకులు ఆందోళనలు చేసినా ఫలితం లేదన్నారు. బీసీ ప్రధానిగా ఉన్న మోదీ ప్రభుత్వంలో కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖ లేదని ఆయన గుర్తు చేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, రైతుబంధు జి ల్లా అధ్యక్షుడు రోకండ్ల రమేశ్, గ్రంథాలయ చైర్మన్ రౌతు మనోహర్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అలాల అజయ్, నాయకులు జోగు మహేందర్, జహుదొద్దీన్, సాజిదొద్దీన్, సలీం, శైలేందర్, పర్వీన్ సుల్తానా, స్వ రూపారాణి, బొడగం మమత, అనసూయ, కౌన్సిలర్లు పాల్గొన్నారు.