బీఆర్ఎస్ పార్టీ తొమ్మిదేండ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలే గెలుపు సూత్రమని.. వీటిని నాయకులు, కార్యకర్తలు గడప గడపకూ వెళ్లి వివరించాలని ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల కో-ఆర్డినేటర్, ఎమ్మెల్సీ గంగాధర్గౌడ్ సూచించారు. సోమవారం నిర్మల్ జిల్లా కడెం మండలంలోని కొండుకూర్ ఎస్కే ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించగా.. స్థానిక ఎమ్మెల్యే రేఖానాయక్తో కలిసి ఎమ్మెల్సీ గంగాధర్గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. మళ్లీ బీఆర్ఎస్సే అధికారంలోకి వస్తుందని, కష్టపడ్డ ప్రతి కార్యకర్తకూ తప్పకుండా గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుందన్నారు. అలాగే తెలంగాణ ఉద్యమ కాలంలో పనిచేసిన కవులు, కళాకారులను ప్రత్యేకంగా గౌరవించుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
– కడెం, మే 22
కడెం, మే 22 : బీఆర్ఎస్ పార్టీ తొమ్మిదేండ్ల కాలంలో చేసిన అభివృద్ధి పనులు, ప్రజలకు నేరుగా దక్కిన ఫలాలే తిరిగి అధికారంలోకి తెస్తాయని ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల కో-ఆర్డినేటర్, ఎమ్మెల్సీ గంగాధర్గౌడ్ పేర్కొన్నారు. సోమవారం నిర్మల్ జిల్లా కడెం మండలంలోని కొండుకూర్ ఎస్కే ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. రాష్ట్ర ఏర్పాటు నాటి నుంచి నేటి వరకు అనేక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి పౌరుడికి లబ్ధి చేకూర్చేలా చేసింది బీఆర్ఎస్ పార్టీయే అని అన్నారు. తెలంగాణ వంటి మోడల్ పథకాలను దేశంలో అమలు చేయడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతున్నదన్నారు. అలాగే తెలంగాణ ఉద్యమ కాలంలో పని చేసిన కవులు, కళకారులు, విలేకరులను కూడా ప్రత్యేకంగా సన్మానించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ఖానాపూర్లో తొమ్మిదేళ్లుగా జరిగిన అభివృద్ధి గురించి వివరించారు. 13 గురుకులాలను తీసుకొచ్చి విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తున్నట్లు చెప్పారు.
మళ్లీ మనదే అధికారం..
రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలనిఎమ్మెల్యే రేఖానాయక్ సూచించారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉం టామని, అధైర్యపడొద్దని భరోసానిచ్చారు. గతం లో ఎన్నడూ లేని అభివృద్ధి చేశామని, రానున్న రోజుల్లో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో మరిన్ని అభివృద్ధి పనులను పూర్తి చేయనున్నట్లు చెప్పారు. పో డు భూములకు పట్టాలివ్వడం, డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం, ప్రతి గ్రామానికీ సీసీ రోడ్లు, నూ తన మండలాలకు తారు రోడ్ల నిర్మాణం, ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా తాగునీరు, వృద్ధులకు, వికలాంగులకు పింఛన్, అనేక సంక్షేమ పథకాలతో ఖానాపూర్ను అభివృద్ధి చేసినట్లు వివరించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ శంకర్, బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు చంద్రశేఖర్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు జీవన్రెడ్డి, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు రఫీక్ హైమద్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు బాపురావు, ఇందూర్నేత, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు వేణుగోపాల్, ఉప సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు
మల్లేశ్ యాదవ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మల్లేశ్, వైస్ ఎంపీపీ కట్టా శ్యాంసుందర్, నాయకులు బోయిని మంగ, బొడ్డు గంగన్న పాల్గొన్నారు.