భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని, ఇందుకు అనుగుణంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు కలిసి కట్టుగా కృషి చేయాలని ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. మంగళవారం నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రమైన కుంటాలలోని మున్నూరు కాపు సంఘం ఫంక్షన్ హాల్.. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని కొండాపూర్.. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం గిమ్మ గ్రామంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమాలకు ఆదిలాబాద్-నిర్మల్ జిల్లాల కో-ఆర్డినేటర్ గంగాధర్ గౌడ్, ముథోల్, ఖానాపూర్, ఆదిలాబాద్ ఎమ్మెల్యేలు విఠల్రెడ్డి, రేఖానాయక్, జోగు రామన్నలు పాల్గొని మాట్లాడారు. కేసీఆర్తోనే సుస్థిర పాలన సాధ్యమైందని, ఆయన సారథ్యంలోనే రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతున్నదని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై విస్తృతంగా చర్చ జరగాలని సూచించారు. కేంద్ర విధానాలతో రైతులు ఎలా నష్టపోతున్నారో వివరించాలని పేర్కొన్నారు. తొమ్మిదేండ్లలో రాష్ర్టాన్ని కనీవినీ ఎరుగనిరీతిలో అభివృద్ధి చేశాడని, ప్రతి దళితుడికి రూ.10 లక్షలు అంది స్తున్న రాష్ట్రం మనదే కావడం గర్వంగా ఉందన్నారు.
– నమస్తే తెలంగాణ బృందం
భైంసా/కుంటాల, ఏప్రిల్ 18 : రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీయే మూడోసారి అధికారంలోకి వస్తుందని, ఇందుకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల కో-ఆర్డినేటర్, ఎమ్మెల్సీ గంగాధర్గౌడ్ స్పష్టం చేశారు. మంగళవారం నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రమైన కుంటాల గ్రామంలోని మున్నూరు కాపు సంఘం ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డితో కలిసి ఎమ్మెల్సీ హాజరై మాట్లాడారు.
సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే మన రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తున్నదని వెల్లడించారు. ప్రాణ త్యాగానికి సిద్ధపడి రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్, తొమ్మిదేండ్లలో చాలా అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. ఉచిత కరంటు, పెట్టుబడి సాయం అందిస్తూ రైతును రాజును చేశాడని తెలిపారు. పల్లెల ప్రగతికి ప్రకృతి వనాలతోపాటు వైకుంఠధామాలు, క్రీడామైదానాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లికి కల్యాణలక్ష్మి, వృద్ధులు, వితంతులకు పింఛన్ అందస్తూ భరోసా ఇస్తున్నాడని వెల్లడించారు. ప్రతి దళితుడికి రూ. 10 లక్షలు అందజేయాలనే ఉద్దేశంతో దళితబంధు ప్రవేశపెట్టారని, ఇప్పటికే చాలా మందికి అందజేసి వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నాడన్నారు. దేశంలో రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు.
ప్రజలకు అండా.. గులాబీ జెండా..
రాష్ట్ర ప్రజలకు గులాబీ జెండా అండగా నిలుస్తున్నదని, సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల వారు సం తోషంగా ఉన్నారని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అంటేనే భరోసా అని పార్టీకి కార్యకర్తలే బలమన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతోందన్నారు. త్వరలోనే సొంత స్థలం ఉండి ఇండ్లు నిర్మించుకోవాలనే వారికి ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థిక సా యం అందజేస్తుందన్నారు. రాష్ర్టానికి కేంద్ర ప్రభు త్వం చేసిందేమి లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నాలం శ్రీనివాస్, మండల కన్వీనర్ పడకం టి దత్తు, పీఏసీఎస్ చైర్మన్ సట్ల గజ్జారాం, ఆత్మ చైర్మన్ అశోక్రెడ్డి, సమతా వెంకటేశ్, సునంద గిరీశ్, మధు, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు ప్రవీణ్, ఆనంద్రావు పటేల్, మల్లేశ్, ఖనీష్ ఫాతి మా, సునీతా భోజన్న, హైమద్ పాషా, దాసరి కిషన్, లక్ష్మీ రమేశ్, బాబురావు, శృతి, మండల నాయకులు అనిల్, శివ, రజనీకాంత్, ఖదీర్, చౌహాన్ రాజు, బోగ లక్ష్మణ్, సోషల్ మీడియా జిల్లా అధ్యక్షుడు దశరథ్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో చేరికలు
బీఆర్ఎస్లో చేరికల పరంపర కొనసాగుతోంది. కుం టాల మండల జడ్పీటీసీ గంగామణి కాంగ్రెస్ను వీడీ బీఆర్ఎస్లో చేరారు. ఆయా మండలాలకు చెందిన పలువురు యువకులు కూడా పార్టీలో చేరారు. వీరికి ఎమ్మె ల్యే విఠల్రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.