భైంసా టౌన్, సెప్టెంబర్, 26 : ప్రతి ఒక్కరూ చాకలి ఐలమ్మ అడుగుజాడల్లో నడవాలని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కామోల్ గ్రామంలో ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుంసర సర్పంచ్ ప్రవీణ్ తండ్రి ఇటీవల అనారోగ్యంతో చనిపోవడంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన వెంట ఏఎంసీ మాజీ చైర్మన్ కృష్ణ, పీఏసీఎస్ చైర్మన్ దేవేందర్, తానూర్ మండల కన్వీనర్ పోతారెడ్డి, ఎంపీటీసీ నర్సారెడ్డి, ఉప సర్పంచ్ శ్రీను, బీఆర్ఎస్ నాయకులు అమేందర్రెడ్డి, శ్రీనివాస్, అవినాశ్, మాజీ ఎంపీటీసీ ప్రతాప్ సింగ్, రజక సంఘం అధ్యక్షుడు శంకర్, ముత్యం, యోగేశ్, మహేశ్, సాయినాథ్, చాకలి దత్తు, సుహానంద్, శ్రీనివాస్, ముత్యం, నర్సయ్య పాల్గొన్నారు.
ప్రొసీడింగ్ కాపీ అందజేత
కుభీర్, సెప్టెంబర్ 26 : పార్డి(కే)లోని శ్రీఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో కల్యాణ మండపం నిర్మించేందుకు దేవాదాయశాఖ నుంచి మంజూరైన రూ. 24లక్షల ప్రొసీడింగ్ కాపీని ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి గ్రామస్తులకు అందజేశారు. గ్రామస్తుల కాంట్రిబ్యూషన్ కింద రెండేళ్ల క్రితం రూ.6లక్షలు చెల్లించడంతో ఎస్టిమేటెడ్ అమౌంట్ రూ.30 లక్షలకు సంబంధించిన ప్రతులను ఆయన బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు దొంతుల సాయన్న, ఆకుల వెంకటేశ్కు అందజేశారు. నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే విఠల్రెడ్డి, మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డికి ఆలయ కమిటీ చైర్మన్ బందెల శంకర్, సభ్యులు జాదవ్ పుండలీక్ పటేల్, బందెల విఠల్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ దొంతుల రాములు తదితరులు గ్రామస్తుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.