ఇచ్చోడ, జూలై 18 : వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం లచ్చింపూర్ రైతువేదికలో మంగళవారం నిర్వహించిన రైతు సభలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతును రాజు చేయాలనే ఉద్దేశంతో 24 గంటల ఉచిత కరెంట్ అందిస్తున్నదన్నారు. ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డికి వ్యవసాయం విలువ ఏం తెలుసని మండిపడ్డారు. ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కరెంట్ అడిగిన రైతులపై కాల్పులు జరిపిన చరిత్ర వారిది అని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కు ట్ర పూరిత రాజకీయాలను తిప్పికొట్టాలని, బీఆర్ఎస్కు ఓటేయాలని పిలుపునిచ్చారు.
త్రీఫేజ్ లైన్ ప్రారంభం..
సిరికొండ మండలంలో మంగళవారం భారీ వర్షాన్ని లెక్క చేయకుండా మారుమూల గ్రామమైన ఫకీర్నాయక్ తండాకు వెళ్లి త్రీఫేజ్ విద్యుత్ లైన్ను బీఆర్ఎస్ నాయకులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే రేఖానాయక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రిమ్మ, ఫకీర్నాయక్ తండా, లచ్చింపూర్ సర్పంచ్లు అనిల్, జాదవ్ లచ్చు, పెందుర్ నర్మద, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు రాజారాం, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.