ఉట్నూర్ రూరల్, ఆగస్టు 12: రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరిగిందని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. శనివారం ‘పల్లె పల్లెకూ రేఖక్క ’ కార్యక్రమంలో భాగంగా మండలంలోని శ్యాంపూర్, ఏందా గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. అనంతరం గ్రామస్తులతో సమావేశం నిర్వహించి ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరుపై ఆరా తీశారు. దశల వారీగా అందరికీ న్యాయం చేస్తామన్నారు. ఇంటింటికీ మిషన్ భగీరథ పథకం ద్వారా నీరు అందిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు. రానున్న ఎన్నికల్లో ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు.
పాఠశాల తనిఖీ
మండలంలోని ఏందా గ్రామంలో ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే రేఖానాయక్ తనిఖీ చేశారు. తరగతి గదులను పరిశీలించారు. మంచిగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. వారికి నాణ్యమైన విద్య, భోజనం అందించాని సిబ్బందికి సూచించారు. పలు సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తేగా, ఐటీడీఏ పీవోతో ఫోన్లో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ శ్రీరాం, సర్పంచ్ మల్లిక, హరి నాయక్, వైస్ ఎంపీపీ దావులే బాలాజీ, ఉప సర్పంచ్ కేశవ్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు అజీముద్దీన్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కందుకూరి రమేశ్, సీనియర్ నాయకులు జగ్జీవన్, సింగారే భరత్, దాసండ్ల ప్రభాకర్, బాజీరావు, కేంద్రే రమేశ్, పాండురంగ్, శ్యాం, బాబాసాహెబ్, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
అర్హులందరికీ న్యాయం చేస్తాం
ఖానాపూర్, ఆగష్టు 12: అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు అందిస్తామని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. పట్టణ శివారులోని కుమ్రం భీం చౌరస్తాలో ఇటీవల లక్కీ డ్రా ద్వారా పంపిణీ చేసిన డబుల్ బెడ్డ్రూం ఇండ్లను శనివారం సందర్శించారు. ప్రభుత్వం సొంతింటి కల సాకారం చేయడంతో ఇండ్లు పొంది గృహప్రవేశం చేసిన లబ్ధిదారులతో మాట్లాడారు. ఇండ్లలో ఏర్పాటు చేసిన సౌకర్యాలపై లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఇతర రాష్ర్టాలకు చెందిన వారిని అర్హులుగా గుర్తిస్తే స్థానికులకు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. పలువురు ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ వరుణ్రెడ్డితో ఫోన్లో మాట్లాడి అర్హులైన ప్రజలకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాలి
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేరవేయాలని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులకు ఎమ్మెల్యే రేఖానాయక్ సూచించారు. మండలంలోని రాజురా గ్రామ కమిటీ అధ్యక్షుడిగా పెద్దిరాజును పట్టణంలోని తన నివాసంలో ప్రకటించారు. అనంతరం శాలువాతో సన్మానించారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, ఏఎంసీ మాజీ చైర్మన్ శంకర్, ఎంపీపీ మొయిద్, నాయకులు రాజగంగన్న, నగేశ్, చరణ్, మెహ్రజ్, గోపాల్, షోయబ్, నసీర్ తదితరులు పాల్గొన్నారు.
పేదల పెన్నిధి కేసీఆర్
ఉట్నూర్, ఆగస్టు 12: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల పెన్నిధి అని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో శనివారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు దరి చేరుతున్నాయని తెలిపారు. దే శంలో ఎక్కడా లేని పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయని చెప్పారు. ఎంపీపీ పంద్ర జైవంత్రావు, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, వైస్ ఎంపీపీ బాలాజీ, మాజీ జడ్పీటీసీ జగ్జీవన్రావు, నాయకులు కందుకూరి రమేశ్, అహ్మద్ అజీం, దాసండ్ల ప్రభాకర్, స్వామి, సతీశ్, సుశీల్, మల్లన్న, రవి, హనుమంత్, వెంకటేశ్ పాల్గొన్నారు.