ఆదిలాబాద్ : పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని డైట్ మైదానంలో ఏర్పాటుచేసిన క్రీడా మైదానాన్ని ఎమ్మెల్యే జోగు రామన్న ప్రారంభించారు. కాసేపు మైదానంలో వాలీబాల్ ఆడుతూ క్రీడాస్ఫూర్తిని చాటారు. అనంతరం యోగా విశిష్టత పట్ల పట్టణ ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యం పట్ల పట్టు సాధించాలంటే క్రీడా మైదానాలలో సమయాన్ని కేటాయించాలని తెలిపారు. సీఎం కేసీఆర్ పిల్లల్లో దాగి ఉన్న క్రీడా సామార్థ్యాలను వెలికితీసి ఉన్నతమైన క్రీడాకారులుగా తీర్చిదిద్దిందేకు క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం మాత్రమే ప్రజల ఆరోగ్యంతో పాటు వారి సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, డిసిసిబి చైర్మన్ అడ్డి భోజా రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ మెట్టు ప్రహ్లద్, వైస్ చైర్మన్ జహీర్ రంజాని, వార్డు కౌన్సిలర్ అశోక్, కౌన్సిలర్ ప్రకాష్,లక్ష్మణ్, మున్సిపల్ కమిషనర్ శైలజ, డీఈ తిరుపతి, ఓరగంటి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.