చెన్నూర్, జనవరి 6: పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులతో జరిగిన సమీక్షా సమావేశానికి చెన్నూర్ నుంచి పలువురు ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు శనివారం హైదరాబాద్కు తరలివెళ్లారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశానికి పలువురు ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక వాహనాల్లో సమీక్షా సమావేశానికి తరలివెళ్లారు. ఈ సమావేశానికి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నవాజొద్దీన్, కౌన్సిలర్లు రేవెల్లి మహేశ్, వేల్పుల సుధాకర్, బీఆర్ఎస్ నాయకులు రాంలాల్ గిల్డా, పెండ్యాల లక్ష్మణ్, కొండపర్తి వెంకటరాజం, గర్రెపల్లి వెంకటనర్సయ్య, వేముల మహేందర్ ఉన్నారు.
మందమర్రి, జనవరి 6: హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశానికి మందమర్రి పట్టణానికి చెందిన బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు తరలివెళ్లారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అధ్యక్షతన జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో నాయకులు పాల్గొన్నారు. హైదరాబాద్కు తరలిన వారిలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జే.రవీందర్, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొంగల తిరుపతి రెడ్డి, ఈశ్వర్, కిరణ్, రావ వేణు, కనకం రవీందర్, పల్లె నర్సింగ్, ఎండీ ఇమ్రోజ్ తదితరులున్నారు.
కాసిపేట, జనవరి 6 : మండలం నుంచి తరలిన వారిలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొల్లు రమణారెడ్డి, జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, దేవాపూర్ ఓసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు తిరుపతిరెడ్డి, ఎంపీటీసీ కొండబత్తుల రాంచందర్, నాయకులు అగ్గి సత్తయ్య, అట్టెపల్లి శ్రీనివాస్, గడ్డం పురుషోత్తం, వడ్లూరి మల్లేశ్, బందెల ప్రేంకుమార్, అక్కెపల్లి బుగ్గ రాజు, దండవేణి చందు తదితరులున్నారు.