ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, జనవరి 11: క్రీడల్లో గెలుపోటములు సహజమని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. గురువారం స్థానిక గిరిజన క్రీడా పాఠశాలలో ఎంపీపీ కప్ పోటీల ముగింపు కార్యక్రమానికి మాజీ ఎ మ్మెల్యే ఆత్రం సకు, జడ్పీటీసీ అరిగేల నాగేశ్వరరావు, అదనపు కలెక్టర్ దాసరి వేణు (రెవెన్యూ)లతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుతులను ప్రదానం చేశారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రా మీణ క్రీడాకారుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు ఎంపీపీ అరిగేల మల్లికార్జున్ పోటీలు నిర్వహించడం అభిందనీయమన్నారు. మా జీ ఎమ్మెల్యే ఆత్రం సకు మాట్లాడుతూ వి ద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. మూడేళ్లుగా ఎంపీపీ కప్ నిర్వహించడం గొప్ప విషయమని కొనియాడా రు.
అదనపు కలెక్టర్ దాసరి వేణు మాట్లాడు తూ గ్రామీణ ప్రాంత క్రీడాకారులు ఇలాంటి వేదికలను సద్వినియోగం చేసుకొని జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరిగేలా మల్లికార్జున్, జిల్లా రవాణా శాఖ అధికారి గంధం లక్ష్మి, డీఈవో పార్శి అశోక్, ఎంపీడీవో శశికళ, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, పరీక్షల సహాయ కమిషనర్ ఉదయ్ బాబు, జిల్లా క్రీడల సమాఖ్య అధికారి సాంబశివరావు. క్రీడల అధికారి బండ మీనా రెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుభాష్, తదితరులు ఉన్నారు.