జైనూర్, సెప్టెంబర్ 8 : బీఆర్ఎస్లోని ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటానని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి భరోసా కల్పించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం లో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అని జిల్లా కేంద్రంలో కలెక్టరేట్, జోడేఘాట్ కుమ్రం భీం అభివృద్ధి, ప్రతి గిరిజన గ్రామంలో సంక్షేమ పథకాలు, షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి, రైతుబంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ ప్రవేశపెట్టిందని తెలిపారు.
ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మండల కార్యకర్తలు సహాయ సహకారాలు ఎంతగానో ఉన్నాయని మీ రుణం ఎప్పటికీ మరిచిపోనని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని కార్యకర్తలు భయపడే అవసరం లేదని రాబోయే రోజుల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేయకున్నా, ప్రజలకు అందకున్నా మలి దశ ఉద్యమానికి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఎన్నో అవమానాలతో చావు నోట్లో వెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి, ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన ఘనత కేసీఆర్కే దకుతుందని కొనియాడారు. పలువురు కార్యకర్తలు కోవ లక్ష్మికి శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవ్రావు, పాక్స్ డైరెక్టర్ కొడప హన్నుమపటేల్, జిల్లా పరిషత్ కో-ఆప్షన్ మెంబర్ అబుతాలిబ్, ఎంపీపీ కుమ్ర తిరుమల విశ్వనాథ్, పలు గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు ఇంతియాజ్లాలా నాయకులు మెస్రం అంబాజీ, పవన్ జన్నావార్, సతీశ్ ముండే తదితరులు పాల్గొన్నారు.
లింగాపూర్, డిసెంబర్ 8 : లింగాపూర్ మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. శుక్రవారం ఆమె మండలంలోని ఎల్లా పటార్ గ్రామానికి చెందిన సలాం మారు ఎమ్మెల్యే కోవ లక్ష్మి విజయం సాధించాలని 14 రోజులు పాటు తిండి తినకుండా దీక్ష చెప్పడంతో సలాం మారును నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమణ చేయించారు. లింగాపూర్ మండలం నుంచి అధిక మెజార్టీ ఇచ్చి గెలిపించినందుకు ప్రజలందరికీ రుణపడి ఉంటానని అన్నారు. జాటోత్ రాహుల్ కుమారుడు ధ్రువ మృతి చెందడంతో కుటుంబ సభ్యులను పరామర్శించారు.
మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ అంబేదర్ విగ్రహాలను పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె వెంట వెంట జిల్లా గ్రంథాలయ చైర్మన్ కనక యాదవ్ రావు, జైనూర్ మారెట్ కమిటీ చైర్మన్ ఆత్రం భగవంతరావ్, జడ్పీటీసీ ఆడే రకబాయి లక్యా నాయక్, నాగర్ గోజ్ విశ్వం బర్, వైస్ ఎంపీపీ ఆత్మరావ్,సర్పంచులు సుమలత ఈశ్వర్, మనోహర్,చిరంజీవి, మంగి బాయి కిషన్, జ్యోతిరామ్, సులోచన సంతోష్, జైనూర్, లింగాపూర్ మండల అధ్యక్షుడు లాలా, అనిల్ కుమార్, భీమ్రావ్, సంగీత వినోద్ తదితరులు పాల్గొన్నారు.