ముథోల్, జూన్ 6 : అన్ని వర్గాల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం విశేషంగా కృషిచేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. ముథోల్లోని ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శివాజీ విగ్రహ నిర్మాణానికి రూ.2.50 లక్షలు, ముదిరాజ్ సంఘం భవన నిర్మాణానికి రూ.3 లక్షల మంజూరు పత్రాలను సంఘ సభ్యులకు విఠల్రెడ్డి అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగా ణ ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నదని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని తెలియ జేశారు. ప్రతి ఒక్కరూ తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలువాల్సిన అవసరం ఉందన్నారు.
సీఎం సహాయనిధి చెక్కుల అందజేత..
వడ్తాల్ గ్రామానికి చెందిన లక్ష్మణ్కు రూ.16 వేలు, మహేశ్కు రూ.16 వేల సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. పేదలకు సీఎం సహాయ నిధి అండగా ఉంటున్నదన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జడ్పీ వైస్ చైర్మన్ సాగరబాయి రాజన్న, ఎంపీపీ అయేషా అఫ్రోజ్ ఖాన్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ సురేందర్, మాజీ ఎంపీటీసీ పోతన్న యాదవ్, కోఆప్షన్ మెంబర్ మగ్దూమ్, నాయకులు మదన్మోరే, సంతోష్, గంగాధర్ పటేల్, గిరి పటేల్ తదితరులు పాల్గొన్నారు.