మంచిర్యాలటౌన్, డిసెంబర్ 20 : అన్ని వ ర్గాల ప్రజలు తమ తమ పండుగలను సంతోషం గా జరుపుకోవాలని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు సూచించారు. మంచిర్యాల పట్టణంలోని మౌంట్గెన్ చ ర్చిలో మంగళవారం క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. కలెక్టర్ కేక్ కట్చేసి, పంపిణీ చేశారు. అనంతరం పేద క్రైస్తవ కుటుంబాలకు ప్రభుత్వం తరఫున దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కానుకలు అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, కౌన్సిలర్ మినాజ్, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ రాజేశ్వరి, బెంజిమన్, సాల్మన్ తదితరులు పాల్గొన్నారు.
నస్పూర్ మున్సిపాలిటీలో..
సీసీసీ నస్పూర్, డిసెంబర్ 20 : నస్పూర్ ము న్సిపాలిటీలోని నిరుపేద క్రైస్తవ కుటుంబాలకు ఎ మ్మెల్యే దివాకర్రావు కానుకలను అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలకు తె లంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తున్నదన్నారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి, పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, కౌన్సిలర్లు పూదరి కుమార్, చిడం మహేశ్, నాయకులు మేరుగు పవన్కుమార్, ముత్తె రాజేశం, గర్శె భీమయ్య, రఫీక్ఖాన్, తిప్పని బానేశ్, చర్చిల నిర్వాహకులు పాల్గొన్నారు.
హాజీపూర్లో చెక్కుల పంపిణీ..
హాజీపూర్, డిసెంబర్ 20 : హాజీపూర్ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ మందపెల్లి స్వర్ణలతతో కలిసి 64 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే దివాకర్రావు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కు లు అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాయలింగు, ఎంపీడీవో అబ్దుల్ హై, వైస్ ఎంపీపీ బేతు రమాదేవి-రవి, రైతు బందు సమితి మం డల కన్వీనర్ పూస్కూరి శ్రీనివాస్ రావు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మొగిళి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి జీవన్ రావు, మంచిర్యాల సింగిల్ విండో చైర్మన్ సందెల వెంకటేశ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీపీ, తహసీల్ కార్యాలయాల సిబ్బంది, వార్డు సభ్యులు, నాయకులు జూపాక ధర్మయ్య, మట్టపెల్లి సత్యనారాయణ రావు, పోతు మల్లేశ్, బేర పోచయ్య, గడ్డం తిరుపతి యాదవ్, సోగాల కిష్టయ్య, కుడుక సత్యం పాల్గొన్నారు.
లక్షెట్టిపేటలో 8 మందికి..
లక్షెట్టిపేట, డిసెంబర్ 20 : లక్షెట్టిపేట పట్టణంలోని విశ్రాంతి భవనంలో 8 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే దివాకర్రావు షాదీ ముబారక్ చెక్కుల ను పంపిణీ చేశారు. డీసీఎంఎస్ చైర్మ న్ తిప్పని లింగన్న, మున్సిపల్ చైర్మన్ నలుమాసు కాంతయ్య, వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, తహసీల్దార్ జ్యోత్స్న, వైస్ ఎంపీపీ దేవేందర్రెడ్డి, కౌన్సిలర్లు చాతరాజు రాజన్న, సురేశ్ నాయక్, మెట్టు కల్యాణిరాజు, పార్టీ పట్టణాధ్యక్షుడు పాదం శ్రీనివాశ్, నాయకులు సజ్జు, రాందేని తిరుపతి, నడిమెట్ల రాజన్న, అంకతి కిషన్, షాబొద్దీన్, గరిసె రవీందర్, కాసు సురేశ్ పాల్గొన్నారు.