భైంసాటౌన్, నవంబర్ 17 : పక్క రాష్ట్రంలో ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రె స్ అక్కడి రైతులకు మూడు గంటల కరెంటు కూడా ఇవ్వకుండా కష్టాల్లోకి నెట్టిందని ముథోల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి విఠల్ రెడ్డి పేర్కొ న్నారు. కాంగ్రెస్, బీజేపీ మాటలను నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు. శుక్రవారం భైంసా మండలం లోని వానల్పాడ్, సుంక్లీ, పెండ్పల్లి గ్రామాల్లో రోడ్ షోలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భం గా ఆయా చోట్ల ఆయన మాట్లాడారు. చందాల కోసం ఇంటికి వెళ్తే ఖాళీ చేతులతో పంపే నాయ కులు ధర్మం గురించి మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణలో రూ. 2016 తో మొదలు కొని రూ. 4016 వరకు వివిధ రకాల పెన్షన్లను సీఎం కేసీఆర్ అందిస్తున్నారని, మోడీ స్వరాష్ట్ర మైన గుజరాత్తో కేవలం రూ. 800ల పెన్షన్ అంది స్తున్నారని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒక్క దేవాలయాన్ని నిర్మిం చలేదని తెలిపారు.
కేసీఆర్ సీఎం అయ్యాక ముథో ల్ నియోజకవర్గంలోనే 70కి పైగా దేవాల యాల పునర్నిర్మాణం జరిగిందన్నారు. కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే సామాన్య ప్రజలంతా సీఎం, ఎమ్మెల్యేలేనని చెప్పారు. ఏఎంసీ మాజీ చైర్మన్ కృష్ణ మాట్లాడుతూ పిలిస్తే పలికే నాయ కుడు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అని పేర్కొన్నారు. నిరంతరం పేదల కష్టాల్లో పాలుపంచుకునే ఎమ్మె ల్యే విఠల్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భూమా రెడ్డి, మాజీ జడ్పీటీసీ సూర్యం రెడ్డి, స్థానిక సర్పం చ్ మాన్కుర్ పెద్ద రాజన్న, ఎంపీపీ కల్పన, గణేశ్ జాదవ్, ఉప సర్పంచ్ దగ్డే ఈశ్వర్, పీఏసీఎస్ చైర్మన్ దేవేందర్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ సాయి నాథ్, ఏఎంసీ డైరెక్టర్ తోట రాము, సర్పం చ్లు బొబ్బిలి శ్రీనివాస్,
ప్రసాద్ పటేల్, ముత్యం, దుప్పె గణేశ్, శ్రీనివాస్, సతీశ్, నాయ కులు రాంకుమార్, సంజీవ్ పాటిల్, సచిన్ పాటిల్, రాజేందర్, ముత్యం, శ్రీనివాస్ రెడ్డి, భూమేశ్, వెంకట్ రెడ్డి, పోతన్న, రాందాస్, విశ్వనాథ్, మేరాజ్, సాహెబ్ రావు, మధుసూదన్ రెడ్డి, అమేందర్ రెడ్డి, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి, వైస్ ఎంపీపీ గంగాధర్, ఎంపీటీసీ లు మాణిక్ పటేల్, నర్సారెడ్డి, గోవర్ధన్ రెడ్డి, దీక్షిత్, లక్ష్మణ్, తదితరులు ఉన్నారు. వానల్పాడ్ గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల ప్రచా రం నిర్వహించారు. ఎమ్మెల్యే తమ్ముడు సూర్యం రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు గడప గడపకూ వెళ్లి కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థి విఠల్ రెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు.
తానూర్, నవంబర్ 17 : మండలంలోని మహలింగి, బామ్ని, బామ్నితండా గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయ కుడు డాక్టర్ కిరణ్ కుమ్రే వార్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్ పార్టీ అధికార దాహంతో మోసపూరిత హామీలు ఇస్తున్నదని ఆరోపించారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి విఠల్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. హంగిర్గా సొసైటీ చైర్మన్ నారాయణ్ రావు పటేల్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోతారెడ్డి, మాజీ ఎంపీపీ బాశెట్టి రాజన్న, మాజీ జడ్పీటీసీ ఉత్తం బాలే రావు, కోఆప్షన్ సభ్యుడు గోవింద్ పటేల్, బీఆర్ ఎస్ మండల ఉపాధ్యక్షుడు చంద్రకాంత్ యాద వ్, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
భైంసా, నవంబర్ 17 : భైంసాలోని పలు ఏరియాల్లో బీఆర్ఎస్ నాయకులు ప్రచారం నిర్వ హించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఫారూఖ్ హైమద్ మాట్లాడుతూ పదేళ్ల అభివృద్దిని చూసి ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. మైనార్టీ అధ్య క్షుడు ఆళా, తదితరులు ఉన్నారు.
ముథోల్, నవంబర్ 17 : బీఆర్ఎస్ అభ్యర్థి విఠల్ రెడ్డిని గెలిపించుకుందామని ముథోల్ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అఫ్రోజ్ ఖాన్ పేర్కొన్నారు. ముథోల్లోని నయాబాదిలో బీఆర్ ఎస్ ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో అమలు చేసిన సంక్షేమ పథకాలను గడప గడప కూ బీఆర్ఎస్ కార్యకర్తలు వివరించాలని కోరారు. విఠల్ రెడ్డి గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయా లని సూచించారు. ఎంపీటీసీ సరళ శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్ అనిల్, షౌకత్ అలీ, నాయ కులు సమీ ఉల్లాఖాన్, మగ్దుమ్తో పాటు మైనా ర్టీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
లోకేశ్వరం, నవంబర్ 17 : బీఆర్ఎస్కు తిరు గు లేదు.. ఈ సారి ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి పక్కా బంపర్ మెజార్టీ వస్తుందని జడ్పీ మాజీ చైర్మన్ లోలం శ్యాంసుందర్ పేర్కొన్నారు. పిప్రి గ్రామం లో గడప గడపకూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మండలంలో ఏ ఊరికి వెళ్లినా ప్రజలు బీఆర్ఎస్కు బ్రహ్మరథం పడుతున్నారని విఠల్ రెడ్డి గాలికి ప్రతిపక్షాలు బేజారు అవుతున్నాయని పేర్కొన్నారు. ఎంపీపీ లలితా భోజన్న, మండల కన్వీనర్ కరిపె శ్యాం సుందర్, సింగిల్ విండో చైర్మన్ రత్నాకర్రావు, సర్పంచ్ల సంఘం అధ్యక్షులు భుజంగ్ రావు, పిప్రి సర్పంచ్ ముత్తవ్వ, సాయన్న, సర్పంచ్లు భీంరావు, దిగంబర్, ఎంపీటీసీ దత్తురామ్ పటేల్, రాణి, అనిల్, నాయకులు సుదర్శన్ రెడ్డి, నాలం గంగయ్య, విజయ్ రావు, బండి ప్రశాంత్, ప్యాట సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
కుభీర్, నవంబర్ 17 : సీఎం కేసీఆర్ తీసు కొచ్చిన పథకాలు, సంక్షమ కార్యక్రమాలు దేశా నికి రోల్మోడల్గా నిలిచిపోయాయని బీఆర్ఎస్ నాయకులు పడకంటి రమాదేవి పేర్కొన్నారు. మండలంలోని హల్ద, చాత తదితర గ్రామాల్లో ఆమె బీఆర్ఎస్ నాయకులు ఎన్నీల అనిల్, తూము రాజేశ్వర్, బాబు, మాజీ ఎంపీటీసీ ఏశాల విఠల్తో కలిసి ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఆమెకు మంగళహారతులతో ఘన స్వాగతం పలికి ఆహ్వానించారు. కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా విఠల్రెడ్డిని మూడో సారి ఎన్నుకోవాలని కోరారు. ఏ గ్రామానికి వెళ్లినా ప్రజల ఆదరణ చూస్తే ఆనందంగా ఉందని పేర్కొ న్నారు. ఈ పలువురు ఆయా పార్టీలకు చెందిన యువకులు బీఆర్ఎస్లో చేరారు. సిద్ధం వివేకా నంద, లింగేశ్వర్, అంతకు ముందు అన్నాబావు సాటే, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రచార రథంతో వీధుల గుండా తిరిగి మాట్లాడారు. ఆయా గ్రామాల ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.