కోటపల్లి, నవంబర్ 11 : ఒక వాగు… పది గ్రామాల ప్రజలకు ప్రాణ సంకంటం. వర్షం పడిందంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉండాల్సిన దుస్థితి. వాగు ఉప్పొంగితే ఎటు వాహనాలు అటే.. ఎక్కడి ప్రజలు అక్కడే.. అలాంటి గోస నుంచి చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పది గ్రామాల ప్రజలకు విముక్తి కల్పించారు. ఏండ్ల కొద్ది అపరిషృతంగా ఉన్న సమస్యకు ఏడాదిలో పరిష్కారం చూపారు. సమస్యను కండ్లరా చూసిన విప్ బాల్క సుమన్ పట్టుబట్టి నిధులు తెచ్చి వాగుపైన బ్రిడ్జి నిర్మించి తానేంటూ నిరూపించుకున్నాడు. కోటపల్లి మండలంలోని ఎదుల్లబందం గ్రామం సమీపంలోని తుంతుంగా వాగుపైన బ్రిడ్జి లేక వర్షాకాలం వాగు అవతల ఉన్న పది గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతుండగా వాగుపైన బ్రిడ్జి నిర్మాణం చేపట్టి, నిర్మాణ పనులను ఏడాదిలోగా పూర్తి చేసి పది గ్రామాల ప్రజల కష్టాలకు పుల్స్టాఫ్ పెట్టాడు.
కోటపల్లి మండలంలోని ఎదుల్లబంధం గ్రామ సమీపంలోని తుంతుంగా వాగు కష్టాలు అంతాఇంతా కావు.
భారీ వర్షాలు కురిసి వాగు ఉప్పొంగితే ప్రవాహం అవతల ఉన్న ఎదుల్లబంధం, సిర్సా, పుల్లగామ, రొయ్యలపల్లి, ఆలుగామ, జనగామ, సూపాక, వెంచపల్లి, నందరాంపల్లి గ్రామా ల ప్రజలు జల దిగ్బధంలో ఉండేవారు. తుంతుం గా వాగు ప్రవాహం అధికంగా ఉంటుండడం వల్ల ఈ గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయేవి. ఎలాంటి కష్టం వచ్చినా నీటి ప్రవాహం దాటే ఆస్కారం లేకపోవడంతో వర్షాకాలం పది గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపేవారు.అలాంటి ప్రజల కష్టాలను కండ్లరా చూసి న ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఎడాది తిరగకముందే వాగుపై బ్రిడ్జి నిర్మాణాకి రూ.8 కోట్ల నిధు లు మంజూరు చేసి పనులు ప్రారంభించేలా చర్య లు తీసుకున్నాడు.
ప్రతి సంవత్సరం తుంతుంగా వాగు వల్ల ఇక్కడి ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారు. ప్రతి సంవత్సరం పది గ్రామాల ప్ర జలు ఇబ్బందులు పడుతుండగా, వారి కష్టాలను 2020 ఆగస్టు 17న ప్రభుత్వ విప్ బాల్క సుమన్ స్వయంగా పరిశీలించారు. వారి సమస్యలను చూ సిన విప్ అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బ్రిడ్జి నిర్మాణానికి రూ. 8 కోట్ల నిధులు మంజూరు చేయించి గత సంవత్సరం ఏప్రిల్లో బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించారు.
తుంతుంగా వాగుపై బ్రిడ్జి లేక ప్రతి సంవత్స రం ప్రజలు ఇబ్బందులు పడుతుండేవారు. 2020ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు తుంతుం గా చెరువు మత్తడి ఉధృతంగా ప్రవహించింది. సూపాక గ్రామానికి చెందిన నిట్లూరి శ్రీలత అనే గర్భిణికి పురిటి నొప్పులు ప్రారంభం కాగా వాగు ఒడ్డు వద్దే ఉండిపోయింది. పురిటి నొప్పు లు పెరుగుతుండగా, రంగంలోకి దిగిన పోలీస్లు, స్థానిక నాయకులు అతి కష్టంమీద ట్రాక్టర్ సహాయంతో గర్భిణిని వాగు దాటించారు. ఈ సమస్యను తెలుసుకున్న ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సమస్యకు పరిష్కారం చూపాలని భావించిన ప్రభుత్వ విప్ సుమన్ పట్టుదలతో ముందుకు సాగి ఇక్కడి ప్రజల కష్టాలను అసెంబ్లీలో ప్రస్తావించడంతో పాటు, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి ప్రశాం త్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళాడు. ఇక్కడి ప్రజల కష్టాలను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం తుంతుంగా చెరువు మత్తడి వద్ద బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.8 కోట్లు మంజూరు చేసింది.
తుంతుంగా వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి పట్టువదలని విక్రమార్కుడిలా కృషి చేసిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్ వాగుపై బ్రిడ్జి నిర్మాణ పనులను 2021 ఏప్రిల్27న ప్రారంభించారు. బ్రిడ్జి నిర్మా ణ శంకుస్థాపన అనంతరం జూలైలో పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్ కేవలం 11 నెలల్లోనే పనులు పూర్తి చేశాడు. విప్ బాల్కసుమన్ ఎప్పటికప్పుడు బ్రిడ్జి నిర్మాణ ప్రగతిని తెలుసుకుంటూ అధికారులకు సూచనలిస్తూ ముందుకు సాగడం తో వర్షాకాలం ప్రారంభానికల్లా బ్రిడ్జి పూర్తయి అందుబాటులోకి వచ్చింది. ఏండ్లుగా పరిష్కారం కాని సమస్య విప్ సుమన్ ప్రత్యేక చొరవతో ఏడాదిలో సాకారం కావడం వల్ల వాగు అవతల ఉన్న పది గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నా రు. ఏడాదిలోగా బ్రిడ్జి నిర్మాణం పూర్తికాగా 2022 జూన్ 15న రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, విప్ బాల్క సుమన్, ఎమ్మె ల్సీ దండే విఠల్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ల చేతుల మీదుగా ప్రారంభించారు.