నిర్మల్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): చేనేతపై కేంద్ర ప్రభుత్వం విధించిన 5 శాతం జీఎస్టీని ఎత్తివేయాల్సిందే అని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇం ద్రకరణ్రెడ్డి డిమాండ్ చేశారు. ఈమేరకు బు ధవారం నిర్మల్ నుంచి ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పోస్టుకార్డు రాశారు. ఇప్పటికే రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ చేనేత పరిశ్రమపై జీఎస్టీని ఎత్తేయాలని చేపట్టిన పోస్టుకార్డు ఉద్యమంలో భాగంగా తామందరం ప్రధానికి ప్రత్యేకంగా పోస్టుకార్డు రాస్తున్నట్లు తెలిపారు. తనతో పాటు జిల్లాలో ని ఎమ్మెల్యేలు, పార్టీ ప్రజాప్రతినిధులు, నా యకులు, కార్యకర్తలందరూ ఇక ప్రధానమంత్రికి వరుసగా పోస్టుకార్డులు రాసి జీఎస్టీని ఎత్తివేయాలని డిమాండ్ చేయనున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం చేనేత పరిశ్రమను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు పన్నుల పేరిట భారం మోపుతున్నదని ఆరోపించారు. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులను ఆదుకునేందుకు అనేక కార్యక్రమాలు చే స్తుంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మా త్రం కార్మికుల పొట్టగొట్టే పన్నులు విధిస్తున్నదని మండిపడ్డారు. కేంద్రం దిగివచ్చే వరకు ఈ పోస్టుకార్డు నిరసనలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.
కోటపల్లి, అక్టోబర్ 26 : చేనేతపై జీఎస్టీని ఎత్తివేయాలని మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ అన్నారు. చేనేత జౌళి శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ప్రధాని నరేంద్రమోదీకి బుధవారం ఆయన పోస్టు కార్డు రాశారు. చేనేత వృత్తి అని, వ్యాపారం కాదని, దానిపై జీఎస్టీ విధించడం సరికాదన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేనేత రంగాన్ని ప్రోత్సహిస్తుంటే కేంద్ర ప్రభుత్వం నేతన్నలను జీఎస్టీ పేరిట ఇబ్బందులకు గురి చేయాలని చూస్తుందన్నారు. జీఎస్టీ విధింపు వల్ల లక్షలాది మంది చేనేత కార్మికుల ఉపాధికి ముప్పు వాటిల్లే ప్రమాదముందని, దీనిని దేశవ్యాప్తంగా చేనేత కార్మికులు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరూ ప్రధానికి పోస్టు కార్డులు రాసి తమ నిరసన తెలపాలని పురాణం సతీశ్ కుమార్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో చెన్నూర్ మున్సిపల్ కౌన్సిలర్స్ పోగుల సతీశ్, జోడు శంకర్, టీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు భైస ప్రభాకర్, మండల టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకులు బెల్లంపల్లి మల్లయ్య, సుందిళ్ల వెంకటి, నీల మనోహర్, కోమట్ల శ్రీకాంత్, శ్రీశైలం, కోమట్ల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.