చెన్నూర్, మార్చి 15 : చెన్నూర్ నియోజకవర్గం లో రూ 200 కోట్ల నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బాల్క సుమన్, రాష్ట్ర మం త్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డితో కలిసి రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు బుధవారం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఉదయం 10 గంటలకు నియోజకవర్గం లో ప్రారంభమైన మంత్రి హరీశ్రావు పర్యటన 3 గంటలకు ముగిసింది. చెన్నూర్ మండలంలోని కిష్టంపేట జోడు వాగుల వద్ద రూ 2 కోట్లతో 450 ఎకరాల్లో ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఏకో పార్కును ప్రారంభించారు. అనంతరం రూ 21.70 కోట్లతో నిర్మించనున్న వంద పడకల సర్కారు దవాఖాన భవనానికి, రూ 4 కోట్లతో ఏర్పాటు చేయనున్న బస్ డిపోకు శంకుస్థాపన చేశారు.
అనంతరం చెన్నూర్లో రూ 2.65 కో ట్లతో 6.34 ఎకరాల్లో నిర్మించిన మినీ స్టేడియాన్ని ప్రారంభించి, రూ 1.70 కోట్లతో చేపట్టే అదనపు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం రూ 3 కోట్లతో నిర్మించిన కుమ్మరి కుంట మినీ ట్యాంకు బండ్ను, రూ 1.50 కోట్లతో నిర్మించిన డంప్ యార్డు , రూ 18 కోట్లతో నిర్మించిన నాలుగు లేన్ల ప్రధాన రహదారి, సెంట్రల్ లైటింగ్ను, నడిబొడ్డున రూ 2.50 కోట్లతో 2 ఎకరాల్లో నిర్మించిన కేసీఆర్ పార్కును ప్రారంభించారు. రూ 7.20 కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటేడ్ వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ భవనం, ప్రధాన రహదారి కూడళ్లల్లో ఏర్పాటు చేసిన మహకవి వానమామలై వరదాచార్యులు, తెలంగాణ తల్లి, మహత్మా జ్యోతి బాపూలే, సావిత్రీబాయి పూలే విగ్రహాలను ప్రా రంభించారు. అనంతరం రూ 1.50 కోట్లతో నిర్మించనున్న సమ్మక్క-సారలమ్మ మహిళా భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం రూ 6 కోట్లతో నిర్మించిన పెద్ద చెరువు మినీ ట్యాంక్ బండ్ను ప్రారంభించారు. అలాగే చెన్నూర్ నియోజకవర్గంలో 100 గ్రామ పంచాయతీల్లో రూ 4 కోట్లతో నిర్మించనున్న 100 గ్రంథాలయ భవనాలకు, రూ 7 కోట్లతో నిర్మిస్తున్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో రూ 2.97 కోట్లతో చేపట్టే అదనపు పనులకు శంకుస్థాపనలు చేశారు.
తొలివిడుతలో నియోజకవర్గంలో 77గ్రామ పంచాయతీల్లో రూ 13.86కోట్లతో నిర్మించే 77 సమ్మక్క-సారలమ్మ మహిళా భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆయా కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రి అ ల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, బెల్లంపల్లి ఎమ్మెల్య్యే దుర్గం చిన్నయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రవీణ్, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మహారాష్ట్రలోని అహేరీ మాజీ ఎమ్మెల్యే దీపక్ దాదా ఆత్రం, కలెక్టర్ బదావత్ సంతోష్, అదనపు కలెక్టర్ రాహుల్, అటవీశాఖ ప్రధాన సంరక్షణ అ ధికారి డోగ్రియల్, పలువురు ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
చెన్నూర్ నియోజవర్గంలో ..
చెన్నూర్/ చెన్నూర్ టౌన్/ చెన్నూర్ రూరల్/ కోటపల్లి, మార్చి 14 : చెన్నూర్ పట్టణంలో మంత్రులు హరీశ్ రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ బుధవారం పర్యటించారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్, జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, కలెక్టర్ సంతోష్తో పాటు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం చెన్నూర్ ఉన్నత పాఠశాల మైదానంలో విప్ అధ్యక్షతన నిర్వహించిన భారీ బహిరంగలో అభయ హస్తం నిధులను విడుదల చేశారు. తునికాకు సేకరణ, వడ్డీలేని రుణాల చెక్కులను లబ్ధిదారుల పంపిణీ చేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ తన వ్యాఖ్యానం, పాటలతో ఆద్యంతం అలరించారు. ఈసభలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడారు. చెన్నూర్ దశ మారిపోయిందని, విప్ బాల్క సుమన్ కృషి అడుగడుగునా కనిపిస్తున్నదని కొనియాడారు.
మరో పోరాటానికి సిద్ధం కావాలి..
ఈ సభ శంఖారావం కావాలి
కాళేశ్వరం పంపు హౌస్ నుంచి పెద్ద ఎత్తున ఒరవడితో నీళ్లు దుంకుతుంటే సుమన్ మాట్లాడుతుంటే అట్లనిపించిందని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ కొనియాడారు. సుమన్ ఉధృతమైన ఉపన్యాసం, కాకలు తీరిన హరీశ్ ఉపన్యాసం మధ్యన, ఇద్దరు నాయకుల మధ్య గాయకుని ప్రసంగం వింటారని చమత్కరించారు. ‘బతుకమ్మ పండుగ నా తెలంగాణ.. బంతి పూల నా తెలంగాణ..’ తెలంగాణ సాంస్కృతిని, తెలంగాణ బతుకును, తెలంగాణకు జరుగుతున్న వివక్షను, విద్రోహాన్ని ప్రజలకు వివరిస్తూ తానొక పక్షిలాగా తెలంగాణ మొత్తం తిరిగినట్లు, ఉద్యమంలో భాగంలో చెన్నూర్ కూడా వచ్చినట్లు గుర్తు చేశారు. తన కృషికి గౌరవంగా ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. మొదట తన కన్న ఊరు సిద్దిపేటకు వెళ్లాలనుకున్నానని, కానీ, విప్ సుమన్ చెన్నూర్కు తీసుకొచ్చారని పరిస్థితులను వివరించారు.
జిల్లాలో అన్నింటికన్నా మిన్నూరు చెన్నూర్ అన్నట్లుందని అభివృద్ధిని కొనియాడారు. చెన్నూర్ సింగరేణి ప్రాంతం గురించి అనేక పర్యాయాలు కొనియాడినట్లు తెలిపారు. ‘తల్లి నువ్వు నవ్వితే మాగాణి.. ఎద తలుపు తెరిస్తే సింగరేణి’.. అంటూ పాడి అలరించారు. ఇక్కడి బొగ్గు కాంతి కిరీటాన్నిస్తే, స్వరాష్ట్రంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాణేశ్వరంగా మారిందని ప్రశంసించారు. వెలుగునిస్తున్న బొగ్గు, తెలంగాణకు బతుకునిస్తున్న కాళేశ్వరం కూడా ఇక్కడే ఉన్నాయని ఉదహరించారు. ‘తలాపునా పారుతుంది గోదారి..’ అంటూ చెన్నూర్ రైతుల గత పరిస్థితులను కళ్లకుగట్టారు. అలాగే పలు పథకాలపై పాడి సబీకులను ఆకట్టుకున్నారు. ‘మానవతకు మారుపేరు.. కేసీఆర్ సారు.. మళ్లమళ్ల రావాలి మనసుగల్ల సర్కారు’ అంటూ చప్పట్ల మధ్య పాడి అలరించారు. ఉచిత పథకాలను రేవడి కల్చర్ అంటూ బీజేపీ అనడం సిగ్గు చేటన్నారు. చెన్నూర్ నల్ల బంగారంపైన కార్పొరేటీకరణ కన్నుపడ్డదని, బొగ్గు గనులను ప్రైవేట్కు అప్పగించాలని బీజేపీ కేంద్ర సర్కారు చూస్తున్నదని మండిపడ్డారు. చైతన్యానికి మారుపేరు, పోరాటానికి పుట్టినిళ్ల్లయిన చెన్నూరు మరోపోరాటానికి సిద్ధం కావాలని అందుకు ఈ సభ శంఖారావం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
చెక్కుల పంపిణీ..
చెన్నూర్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల అనంతరం పట్టణంలోని ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పలువురికి చెక్కులను పంపిణీ చేశారు. 17,899 మంది లబ్ధిదారులకు సంబంధించిన రూ.4.79 కోట్ల అభయ హస్తం నిధులు విడుదల చేశారు. 24,440 మంది లబ్ధిదారులకు రూ.3.36 కోట్ల విలువైన వడ్డీ లేని రుణాల చెక్కును పంపిణీ చేశారు. 2012 నుంచి 2016 వరకు 38,556 మంది తునికాకు కార్మికులకు అటవీశాఖ ఆధ్వర్యంలో రూ.18.11 కోట్ల విలువైన చెక్కులను అందజేశారు.
మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం..
చెన్నూర్ ప్రభుత్వోన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో చెన్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్గా మల్లెల దామోదర్ రెడ్డి, వైస్ చైర్మన్గా బైస ప్రభాకర్, డైరెక్టర్లుగా మెండె హేమలత, భూక్యా రాజ్కుమార్, రుద్రభట్ల సంతోష్, ఖాజా ఖమురొద్దీన్, మద్ద మధుకర్, మానికరౌతు శంకర్, భీం మధుకర్, గాదె శ్రీనివాస్, కంకణాల సంపత్ రెడ్డి, మోర్ల లక్ష్మణ్, జూలూరి మనోహర్, ఉమేశ్ చంద్ గిల్డాతో పాటు పీఏసీఎస్ చైర్మన్, జిల్లా మార్కెటింగ్ అధికారి, చెన్నూర్ వ్యవసాయ అసిస్టెంట్ డైరెక్టర్ తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ మార్కెట్ల చట్టం 1966 ప్రకారం తన సభ్యత్వ విధులు సక్రమంగా నిర్వర్తిస్తామని పేర్కొన్నారు.
మంత్రులు తన్నీరు హరీశ్ రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ విప్ నల్లాల ఓదెలు, కలెక్టర్, అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్ బదావత్ సంతోష్, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) రాహుల్, డీఆర్డీవో శేషాద్రి, జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, వైస్ చైర్మన్ సత్యనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్, డీఎఫ్వో ఆశిష్, టీబీజీకేఎస్ నాయకుడు కెంగర్ల మల్లయ్య, తిప్పని లింగయ్య, మహారాష్ట్ర అహేరి మాజీ ఎమ్మెల్యే దీపక్ ఆత్రం, ఎఫ్డీవో రమేశ్, మున్సిపల్ కమిషనర్ గంగాధర్, తహసీల్దార్ శ్రీనివాస్ రావు దేశ్పాండే, ఏసీపీ నరేందర్, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు, రైతుబంధు సమితి నాయకుడు వాలా శ్రీనివాస్, వార్డు మెంబర్లు, పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
అభివృద్ధికి రోల్మోడల్ బాల్క సుమన్
జైపూర్, మార్చి 15: చెన్నూర్ నియోజకవర్గ అభివృద్ధికి బాల్క సుమన్ రోల్మోడల్ అని మంత్రి హరీశ్ రావు అన్నారు. మండలంలో రూ. 53 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఇందారం ఓసీ వద్ద రాజీవ్హ్రదారిపై రూ. 37.50 కోట్లతో నిర్మించిన ఫైఓవర్ వంతెనను, ఇందారం వద్ద రూ. 4.7లక్షలతో రహదారి సుందరీకరణ, సెంట్రల్లైటింగ్ను ప్రారంభించారు. అనంతరం ఇం దారం బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. రూ. 2.80 కోట్లతో నిర్మించిన రామరావుపేట డబుల్రోడ్డును, స్వాగత్కమాన్ను ప్రారంభించారు. అలాగే ఇందారం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ సహకారంతో బాల్క సుమన్ 60 యేండ్లలో కానీ అభివృద్ధిని నాలుగేళ్లలోనే చేసి చూపించారని పేర్కొన్నారు.
అనంతరం జైపూర్ బస్టాండ్ వద్ద రూ. 2.9 కోట్లతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టం, పెగడపల్లి ఈదులవాగుపై రూ. 3 కోట్లతో బ్రిడ్జి పనులకు భూమి పూజ చేశారు. జైపూర్ బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. జైపూర్ కేజీబీవీ పాఠశాలలో రూ. 2.3 కోట్లతో పాఠశాల భవనానికి భూమి పూజ చేశారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీకి వచ్చిన మంత్రి హరీశ్రావుకు మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, రామగుండం సీపీ రెమా రాజేశ్వరీ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. కార్యక్రమంలో మంత్రి వెంట మంచిర్యాల , బెల్లంపల్లి ఎమ్మెల్యేలు దివాకర్రావు, దుర్గం చిన్నయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణిగుంట్ల ప్రవీణ్, కలెక్టర్ సంతోష్, అదనపు కలెక్టర్ రాహుల్, మంచిర్యాల డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్, శ్రీరాంపూర్ జీఎం సంజీవ్రెడ్డి, జడ్పీటీసీ మేడి సునీత, ఎంపీ పీ రమాదేవి, వైస్ ఎంపీపీ రమేశ్, సర్పంచ్లు మంజుల, సత్యవతి, సువర్ణ, ఎంపీటీసీలు అరికె స్వర్ణ, పెద్దల బాపులతో పాటు వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
మహారాష్ట్రలో నిరంతర విద్యుత్ ఇస్తున్నారా..?
భీమారం, మార్చి 15 : మన పక్కనే ఉన్న మహారాష్ట్రలో 24 గంటల విద్యుత్ ఇస్తున్నారా..?.. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో తాగునీరు వస్తుందా..? అని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్తో పాటు బీఆర్ఎస్ జెండాను మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి హరీశ్రావు మాట్లాడారు. భీమారం చిన్నదని అయిన సుమన్ సీఎం కేసీఆర్ని పట్టుపట్టి మండలంగా ఏర్పాటు చేయించారన్నారు. అంతకుముందు ఆయిల్ ఫామ్ నర్సరీని పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ బదావత్ సంతోష్, టీబీజీకేఎస్ యూనియన్ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య, జడ్పీటీసీ భూక్యా తిరుమల నాయక్, సర్పంచ్ గద్దె రాంరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కలగూర రాజ్ కుమార్, చెన్నూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ భూక్యా రాజ్ కుమార్ నాయక్, బీఆర్ఎస్ నాయకులు ఆత్కూరి రాము, జలంపల్లి సమ్మ య్య, జలంపల్లి తిరుపతి, వేముల శ్రీకాంత్ గౌడ్, వేముల ప్రణీత్ గౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాసరి మధునయ్య, మాజీ జడ్పీటీసీ జర్పు ల రాజ్ కుమార్ నాయక్ పాల్గొన్నారు.
అన్ని హంగులతో దవాఖాన నిర్మాణం
లక్షెట్టిపేట, మార్చి15: లక్షెట్టిపేటలో అన్ని హంగులతో దవాఖానను నిర్మిస్తామని మంత్రి హరీశ్ రావు అన్నారు. పట్టణంలో రూ. 8.50 కోట్లతో నిర్మిస్తున్న సర్కారు దవాఖాన భవనానికి బుధవారం భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా ఏర్పాటుతో 40 ఏండ్ల కళ నెరవేరిందన్నారు. అనంతరం మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మంచిర్యాలలో మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేశారన్నారు. అంతకుముందు మంత్రులు నూతన భవన నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి శిలాఫలాకాన్ని ఆవిష్కరించారు. పనులు వేగంగా, నాణ్యతగా జరిగేలా ఎమ్మెల్యే దివాకర్రావుతో పాటు స్థానిక నాయకులు పర్యవేక్షించాలని సూచించారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నలుమాసు కాంత య్య, బెల్లంపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, కలెక్టర్ బదావత్ సంతోష్, డీఎంహెచ్వో సుబ్బారాయుడు, డాక్టర్ ఆరవింద్, మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణిగుంట ప్రవీణ్ కుమార్, డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, నడిపల్లి ట్రస్ట్ చైర్మన్ నడిపల్లి విజిత్రావు, అదనపు కలెక్టర్ రాహుల్, అదనపు కలెక్టర్ మధుసూదన్, లక్షెట్టిపేట, దండేపల్లి, హాజీపూర్ ఎంపీపీలు అన్నం మంగ, గడ్డం శ్రీనివాస్, మందపల్లి స్వర్ణలత, వైస్ ఎంపీపీలు పసర్తి అనిల్, రమాదేవి, శిశు సంక్షేమ శాఖ చైర్మన్ అత్తి సరోజ, రైతుబంధు సమితి అధ్యక్షుడు గురువయ్య, కౌన్సిలర్లు మెట్టు కల్యాణి, గడికొప్పుల ఉమాదేవి, షబానా, ఓరుగంటి శ్రీకాంత్, చాతరాజు రాజన్న, సురేశ్ నాయక్, పార్టీ మండలాధ్యక్షుడు చుంచు చిన్నయ్య, పట్టణాధ్యక్షుడు పాదం శ్రీనివాస్, జాగృతి నాయకులు బానాల రమేశ్, చుంచు చందు, యూత్ అధ్యక్షుడు అంకతి గంగాధర్ ప్రజలు పాల్గొన్నారు.