మామడ, ఆగస్టు 30: స్వరాష్ట్రంలో ఆలయాల కు మహర్దశ వచ్చిందని రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. పరిమండల్ గ్రామంలో ఇటీవల రూ.60లక్షలతో నిర్మించిన రామాలయంలో బుధవారం మండల పూజకు ఆయన హాజరయ్యారు. ముందుగా గ్రామస్తులు కనకపూర్ నుంచి పరిమండల్ వరకు బైక్ ర్యాలీతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆలయాల నిర్మాణానికి పెద్దఎత్తున నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు. నిర్మల్ నియోజక వర్గంలో ఇప్పటి వరకు 900ఆలయా లు నిర్మించినట్లు తెలిపారు. ధూపదీప నైవేద్యం కింద 6వేల నుంచి 10వేలకు పెంచినట్లు చె ప్పారు.
పరిమండల్లో కల్యాణ మండపం నిర్మాణానికి నిధుల మంజూరు చేస్తానన్నారు. సబ్బండవర్గాల సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభు త్వం పని చేస్తున్నదని తెలిపారు. అనంతరం ఆల య ఆవరణలో మొక్క నాటి నీరు పోశారు. కార్యక్రమంలో సర్పంచ్ నాగమణి, డీసీసీడీ వైఎస్ చైర్మన్ రఘనందన్రెడ్డి, మాజీ చైర్మన్ రాంకిషన్రెడ్డి, వైఎస్ ఎంపీపీ లింగారెడ్డి, బీఆర్ఎస్ మండల కన్వీనర్ చంద్రశేఖర్గౌడ్, ఆర్బీఎస్ మండల కన్వీనర్ గంగారెడ్డి, నేతలు నల్ల లింగారెడ్డి, వికాస్రెడ్డి, కైలాస్, భాస్కర్రావు, మహేందర్, గణేశ్, కిషన్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.