సోన్, జూన్ 15 : తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పల్లె ప్రగతి దినోత్సవాన్ని నిర్వహించారు. నిర్మల్ మండలం భాగ్యనగర్లో జరిగిన సంబురాల్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, కలెక్టర్ వరుణ్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. మొదట గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించారు. మంత్రి, కలెక్టర్ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి ఉత్సాహపరిచారు. అనంతరం జెండాను ఆవిష్కరించారు. గ్రామ పంచాయతీ కార్మికులను శాలువాలతో సన్మానించారు. రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదేళ్లలో సాధించిన ప్రగతి గురించి వివరించారు.
ఖానాపూర్ రూరల్, జూన్ 15 : బాదనకుర్తి గ్రామంలో ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ బాదనకుర్తి-చింతల్పేట్ వరకు రూ. కోటితో బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. నాటి దుస్థితి.. నేటి ప్రగతిని వివరిస్తూ ఫ్లెక్సీలను ప్రదర్శించారు.
భైంసాటౌన్, జూన్, 15 : దేగాం, సుంక్లిలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యేవిఠల్ రెడ్డి పాల్గొన్నారు. పారిశుధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు.
దండేపల్లి/లక్షెట్టిపేట, జూన్15 : దండేపల్లి మండల కేంద్రంతో పాటు గుడిరేవులో నిర్వహించిన పల్లె ప్రగతి వేడుకల్లో మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పాల్గొన్నారు. ఇందులో భాగంగా రెండుచోట్ల నిర్మించనున్న జీపీ భవనాలకు భూమిపూజ చేశారు. అనంతరం పారిశుధ్య కార్మికులను సన్మానించి, ప్రశంసాపత్రాలు అందజేశారు. సూరారం, జెండావెంకటపూర్, కొత్తూర్ గ్రామాల్లో నూతనంగా నిర్మించబోతున్న గ్రామ పంచాయతీ భవనాలకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. పారిశుధ్య కార్మికులను సన్మానించారు.
కాసిపేట, జూన్ 15 : సోమగూడెం భరత్ కాలనీ గ్రామ పంచాయతీలో పల్లె ప్రగతి దినోత్సవంలో జై కేసీఆర్ నినాదాలు మారుమోగాయి. ఇక్కడ కూర్చున్న వారిలో పథకాలు లబ్ధిపొందుతున్న వారు చేతులెత్తాలని కోరగా, ఉత్సాహంగా చేతులెత్తి ‘జై సీఎం కేసీఆర్, జై తెలంగాణ’ అంటూ నినాదాలు చేశారు.
జైపూర్, జూన్ 15 : కాన్కూర్లో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాహూల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పారిశుధ్య కార్మికులను సన్మానించారు.
ఆసిఫాబాద్ టౌన్/కెరమెరి,జూన్ 15 : గోవింద్పూర్, అంకుసాపూర్, పాడిబండ, అప్పెపల్లి గ్రామాల్లో పల్లె ప్రగతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ఆత్రం సక్కు, బీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి అరిగెల నాగేశ్వర్రావుతో కలిసి పాల్గొన్నారు. కొత్తగా నిర్మించబోయే పంచాయతీ భవనాలకు భూమి పూజ చేశారు. ఆసిఫాబాద్ గ్రామ పంచాయతీలో నిర్వహించిన వేడుకల్లో అదనపు కలెక్టర్ చాహత్ బాజ్పాయి, డీఆర్డీవో సురేందర్తో కలిసి పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. కెరమెరి మండలం ఝరిలో గ్రామపంచాయతీ భవనం నిర్మాణానికి అదనపు కలెక్టర్ చాహత్ బాజ్పాయి భూమి పూజ చేశారు. అంతకు ముందు గ్రామంలో ర్యాలీ తీశారు.
రెబ్బెన, జూన్ 15 : ఇందిరానగర్లో నిర్వహించిన సంబురాల్లో కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు ముఖ్య అతిథిగా పాల్గొని పల్లెల్లో నెలకొన్న సమస్యలను సమన్వయంతో పరిష్కరించుకోవాలని సూచించారు. పల్లె ప్రకృతివనం, డంప్యార్డు, శ్మశానవాటిక తదితర వాటిపై పర్యవేక్షణ ఉండాలని సూచించారు.
తాంసి, జూన్ 15 : అంబుగాంలో నిర్వహించిన పల్లె ప్రగతి ఉత్సవాల్లో కలెక్టర్ రాహుల్రాజ్ పాల్గొన్నారు. భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆదివాసీలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. సర్పంచ్ తూర్పుబాయి యశ్వంత్తో కలిసి జాతీయ జెండా ఎగురవేసి.. జాతీయ గీతాన్ని ఆలపించారు. పారిశుధ్య కార్మికులను సన్మానించారు.
తలమడుగు, జూన్ 15 : కజ్జర్ల గ్రామంలో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. పారిశుధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు.
ఇచ్చోడ, జూన్ 15 : ముక్రా(కే)లో పల్లె ప్రగతి వేడుకలు నిర్వహించారు. ట్రాక్టర్ ట్రాలీని పూలతో అలంకరించి భాజా భజంత్రీల నడుమ ర్యాలీ తీశారు. గ్రామపంచాయతీ వద్ద జాతీయ జెండా ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పారిశుధ్య కార్మికులను సన్మానించారు.