తెలుగులో ‘మల్లీశ్వరి’ వంటి హిట్ సినిమాలో నటించింది బాలీవుడ్ అగ్ర కథానాయిక కత్రినాకైఫ్. ఆ తర్వాత బాలీవుడ్లో సూపర్స్టార్డమ్ని సంపాదించుకుంది. వివాహానంతరం సినిమాలకు బ్రేక్నిచ్చి పూర్తిగా కుటుంబానికి పరిమితమైపోయింది. తాజా సమాచారం ప్రకారం ఆమె తెలుగులో రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలిసింది.
ప్రభాస్ ‘స్పిరిట్’లో కీలకమైన అతిథి పాత్ర కోసం చిత్ర బృందం కత్రినాను సంప్రదించారని, ఆమె సుముఖత వ్యక్తం చేసిందని ఫిల్మ్నగర్ టాక్. ‘స్పిరిట్’ సినిమా ఇప్పటికే 40 శాతం షూటింగ్ని పూర్తిచేసుకుంది. సందీప్రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై పాన్ ఇండియస్థాయిలో భారీ అంచనాలున్నాయి. కెరీర్లో తొలిసారి ప్రభాస్ పోలీస్ పాత్రను పోషిస్తుండటంతో ఆయన అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు