డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో గల నాలుగో అంతస్తులోని తన చాంబర్లో ఆదివారం అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి కొలువుదీరారు. గ్రేటర్ హైదరాబాద్ నాలుగు జిల్లాల పరిధిలోని 100 ఆలయాలకు నైవేద్య పథకం వర్తింప చేసే ఫైల్పై సంతకం చేశారు.
అంతకుముందు తన కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. మంత్రిని ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎమ్మెల్సీ, జడ్పీ చైరపర్సన్లు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు.
– నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 30