భీంపూర్, అక్టోబర్ 17 : సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని బీఆర్ఎస్ అభ్యర్థి జాదవ్ అనిల్ అన్నారు. భీంపూర్ మండలం అంతర్గాం మాజీ సర్పంచ్లు, బీజేపీ నాయకులు గుండా ప్రకాశ్యాదవ్, నాయిదాస్, ధనోరా మాజీ సర్పంచ్ శంకర్యాదవ్, తమ కార్యకర్తలు బీఆర్ఎస్ జిల్లా ప్రతినిధి, వైస్ ఎంపీపీ గడ్డం లస్మన్న, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, జడ్పీటీసీ కుమ్ర సుధాకర్ ఆధ్వర్యంలో మంగళవారం నేరడిగొండలో ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారందరికీ జాదవ్ అనిల్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు మరిన్ని ప్రయోజనాలను కలుగజేస్తూ మ్యానిఫెస్టో విడుదల చేయడంతో వివిధ పార్టీల నాయకులు వాటికి ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తామని మాజీ సర్పంచ్లు అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ భీంపూర్ మండల కన్వీనర్ మేకల నాగయ్య, డీసీసీబీ డైరెక్టర్ గోవర్ధన్రెడ్డి , సర్పంచ్లు మడావి లింబాజీ, బక్కి అజయ్యాదవ్, నాయకులు మేకల స్వామి, అనిల్, నితిన్, గోవర్ధన్యాదవ్, బక్కి కపిల్యాదవ్, జీ నరేందర్యాదవ్, ఎం కల్చాప్యాదవ్, పెంటపర్తి లస్మన్న, సవాయి స్వామి , నితిన్, కార్యకర్తలు పాల్గొన్నారు.
దుర్గమ్మను దర్శించుకున్న జాదవ్ అనిల్
దేవీ నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని వాంకిడి గ్రామంలో కొలువుదీరిన దుర్గామాత అమ్మవారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. టెంకాయ కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులు తనపై ఉండాలని వేడుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆయన వెంట వీడీసీ చైర్మన్ నవీన్, గ్రామ పెద్దలు ఉన్నారు.