భైంసాటౌన్, ఏప్రిల్ 20 : దివంగత, మాజీ మంత్రి గడ్డెన్న సేవలు చిరస్మరణీయమని, ఆయన లోటు ఎన్నటికీ తీరదని పలువురు నాయకులు పేర్కొన్నారు. భైంసా మండలంలోని లింగా, దేగాం గ్రామాల్లో, మండల పరిషత్ కార్యాలయంలో గడ్డెన 19వ వర్దంతిని ఘనంగా నిర్వహించారు. స్థానిక బస్టాండ్ వద్ద ఆయన విగ్రహానికి గడ్డెన్న తనయుడు, ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పూలమాల వేసి, నివాళులర్పించారు. కోతుల్గాంకు చెందిన మల్లేశ్ రెడ్డికి రూ.24వేలు, బిజ్జూర్ గ్రామానికి చెందిన సునీల్ కుమార్కు రూ.28 వేల సీఎంఆర్ఎఫ్ మంజూరైంది. కాగా, అందుకు సంబంధించిన చెక్కులను దేగాంలో అందజేశారు. పెండ్పెల్లి గ్రామానికి చెందిన మైనార్టీ సభ్యులు గ్రామంలో ఈద్గా నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరగా, ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.
త్వరలో నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తానని హమీ ఇచ్చారు. అలాగే తానూర్ మండలం హిప్నెల్లి గ్రామంలో ఈ నెల 22వ తేదీన నిర్వహించే అంబేద్కర్ జయంతికి హాజరవ్వాలని అంబేద్కర్ సంఘం సభ్యులు ఎమ్మెల్యేను ఆహ్వానించారు. ఇటీవల ఉత్తమ గ్రామపంచాయతీగా నేషనల్ అవార్డు పొందిన ఉమ్రి సర్పంచ్ను ఎమ్మెల్యే శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సూర్యకాంత్రెడ్డి, నాయకులు వెంకట్ రెడ్డి, భూమేశ్, సదాశివ్, సర్పంచ్ బొబ్బిలి శ్రీనివాస్, లింగా సర్పంచ్ దుప్పె గణేశ్, కో-ఆప్షన్ సభ్యుడు గజానంద్, గణేశ్ పాటిల్, ఎంపీడీవో గోపాలకృష్ణ రెడ్డి, సురేశ్ చందర్ గౌడ్, రాములు, గజ్జారాం, స్వరాజ్, ఏపీవో శివలింగం, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు బాబా సాహెబ్ సోన్కాంబ్లే, ఉపాధ్యక్షులు శివరాం చంద్రే, చంద్రకాంత్ యాదవ్, అవినాశ్, సచిన్, శివరాం చంద్రే, గోవింద్ పటేల్, మండల కన్వీనర్ దత్తు, మల్లన్న యాదవ్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.