కాసిపేట, ఫిబ్రవరి 26 : పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని మంచిర్యాల డీఈవో యాదయ్య పేర్కొన్నారు. సోమవారం కాసిపేటలోని రైతు వేదికలో మండల నోడల్ ఆఫీసర్ రాథోడ్ రమేశ్ అధ్యక్షతన మండలంలోని అన్ని పాఠశాలల పదో తరగతి విద్యార్థులకు వంద శాతం ఉత్తీర్ణత, అత్యధిక జీపీఏ సాధనే ధ్యేయంగా అవగాహన సదస్సు, ప్రేరణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా విద్యాధికారి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పదో తరగతి మొదటి మొట్టని, ఉన్నతంగా మార్కులు సాధించాల్సిన అవసరం ఉందని, భయం వీడి ఇష్టంతో చదువుకోవాలన్నారు.
అనంతరం విద్యార్థులకు సైకాలజిస్ట్, సబ్జెక్టు నిపుణులతో టైమ్ మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, పరీక్ష పత్రంపై అవగాహన, పరీక్షలపై భయం పోగట్టడం, మంచి ఉత్తీర్ణత సాధించడం అంశాలపై వివరించి, విద్యార్థుల ప్రశ్నలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ సింగ్, సెక్టోరల్ ఆఫీసర్ చౌదరి, డీసీఈబీ భీంరావు, మండల నోడల్ అధికారి రాథోడ్ రమేశ్, మోటివేటర్ మహిపాల్, ప్రిన్సిపాల్ అందె నాగ మల్లయ్య, హెచ్ఎంలు సాంబమూర్తి, సుధాకర్ నాయక్, ఎంపీవో నాగరాజు, సబ్జెక్టు నిపుణులు రమేశ్, మధుసూదన్ శర్మ, సెఫియుద్ద్దీన్, సతీశ్, రాజేశం, చంద్రవాస్, మధూకర్, ఉపాధ్యాయులు బండ శాంకరి, అరుణ, రమణారెడ్డి, సీసీవో రాంబాబు పాల్గొన్నారు.