హాజీపూర్, జూలై 18 : కాంగ్రెస్ హయాంలో అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఎమ్మెల్యే దివాకర్రావు అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని కర్ణమామిడి రైతు వేదికలో నిర్వహించిన రైతు సదస్సుకు హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తుంటే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి.. మూడు గంటలే చాలనడం హాస్యాస్పదమన్నారు. ఓర్వలేక రైతులతో రాజకీయం చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.
బేషరతుగా రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడంతో రైతులంతా రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎండాకాలం వచ్చిందంటే కరెంట్ కోసం సబ్స్టేషన్ల ఎదుట ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించేవారని చెప్పుకొచ్చారు. కర్ణమామిడి సర్పంచ్ కొట్టె మహేందర్ అధ్యక్షతన జరిగిన సదస్సులో సర్పంచ్లు గొల్ల శ్రీనివాస్, ఆనె మల్లేశ్, జాడి సత్యం, అన్నం మధుసూదన్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మొగిళి శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ కొటె సత్తయ్య, ఎంపీటీసీలు, రైతు నాయకులు పాల్గొన్నారు.