హాజీపూర్, జనవరి 3 : మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ను జిల్లాలోని తహసీల్దార్లు కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలి సి పుష్పగుచ్ఛం అందించి నూతన సంవత్స ర శుభాకాంక్షలు తెలిపారు. అధికారులు అం కితభావంతో విధులు నిర్వర్తించాలని కలెక్టర్ సూచించారు. హాజీపూర్ తహసీల్దార్ సతీశ్కుమార్, ఇత్యాల కిషన్, సంతోష్ కుమార్, దత్తు ప్రసాద్ తదితరులున్నారు.
జిల్లా అటవీశాఖ కేటీఆర్ సర్కిల్ ఫారెస్టు కన్జర్వేటర్ శాంతారం (ఐఎఫ్ఎస్), జిల్లా అటవీశాఖ అధికారి శివ్ ఆశిష్ సింగ్ను జిల్లా తెలంగాణ నాన్ గెజిటెడ్ (టీఎన్జీవో) ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గడియారం శ్రీహరి బుధవారం అటవీశాఖ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పూల మొక్కను అందజేశారు. టీఎన్జీవో అటవీ శాఖ సెంట్రల్ ఫోరం అధ్యక్షుడు, టీఎన్జీవో కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్, సంయుక్త కార్యదర్శి వెంకటకృష్ణ, రవి కిరణ్ రెడ్డి తదితరులున్నారు.