ప్రభుత్వం మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని పాలచెట్టు ఏరియా-ప్రాణహిత కాలనీల నడుమ రూ. 29.68 కోట్లతో 560 డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తుండగా, దాదాపు పనులన్నీ పూర్తికావచ్చాయి. ప్రస్తుతం అంతర్గత రోడ్లు, డ్రైనేజీల నిర్మాణంతో పాటు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగు నీరందించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే అర్హుల జాబితా ప్రకటించగా, అభ్యంతరాలపై ఫిర్యాదులు స్వీక రించి పరిశీలిస్తున్నది. తుది జాబితా రూపొందిం చి లాటరీ పద్ధతిలో లబ్ధిదారులకు అందించేం దుకు కసరత్తు చేస్తున్నది. మరికొద్ది రోజుల్లోనే సొంతింటి కల సాకారం కానుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
మందమర్రి, ఏప్రిల్ 10 : మందమర్రి మున్సిపాలిటీ పరిధిలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లు దాదాపు పూర్తికావచ్చా యి. ఉద్యమ సమయంలో నిరుపేదల పరిస్థితిని క్షేత్రస్థాయిలో గమనించిన ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు వారు ఆత్మగౌరవంతో జీవించేలా డబు ల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని పాలచెట్టు ఏరియా-ప్రాణహిత కాలనీల నడుమ రూ. 29.68 కోట్లతో మొదటి, రెండో విడుతలో 560 ఇండ్ల ని ర్మాణం చేపట్టారు. చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ వి ప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పలుమార్లు డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాన్ని అధికారులతో కలసి క్షేత్రస్థాయి లో పరిశీలించారు. అధికారులకు ఎప్పటికప్పుడు తగు సూచనలు చేశారు. ఆయన చొరవతో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మా ణం శరవేగంగా పూర్తయ్యిం ది. ప్రస్తుతం ఈ కాలనీలో అంతర్గత రోడ్లు, డ్రైనేజీలను నిర్మిస్తున్నారు.
మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన పైప్లైన్ నిర్మాణంతో పాటు ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చే పనులు కొనసాగుతున్నా యి. మౌలిక సదుపాయాల కల్పన అనంతరం లాటరీ పద్ధతిలో నిరుపేదలకు ఇండ్లు కేటాయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, మున్సిపాలిటీ లో డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం 2480 మంది దరఖాస్తు చేసుకున్నారు. నెల పాటు ఇంటింటి సర్వే నిర్వహించిన రెవెన్యూ అధికారులు 1959 దరఖాస్తులను తిరస్కరించి, 521 మందిని అర్హులుగా గు ర్తించారు. ఈ మేరకు మున్సిపల్ కా ర్యాలయంతో పాటు తహసీల్దార్ కార్యాలయం వ ద్ద అర్హత జాబితాను ప్రదర్శించారు. అభ్యంతరాల పై దరఖాస్తు లు, ఫిర్యాదులను స్వీకరించిన అధికారులు వాటిని పరిశీలిస్తున్నారు. జాబితాలో పేర్లు వ చ్చిన వారు హర్షం వ్యక్తం చేస్తుండగా, తుది జాబితాను రూ పొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కలెక్టర్ నేతృత్వంలో తుది జాబితాను రూపొందిం చి లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎం పిక చే సేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వ చ్చేనెలలోగా ఇండ్ల పంపిణీ పూర్తి చేసే అవకాశమున్నది.
జాబితాలో పేరు వచ్చింది..
డబుల్ బెడ్ రూం ఇండ్ల అర్హుల జాబితాలో నా పేరు వచ్చింది. ఇందుకు సంతోషంగా ఉంది. గతంలో ఉన్న నాయకులు ఇలా ఇండ్లు కట్టించి ఇవ్వలేదు. గృహ నిర్మాణ పథకం పేరిట కొంతమంది పలుకుబడి ఉన్నోళ్లకు నగదు ఇచ్చి చేతులు దులుపుకునేటోళ్లు. కానీ తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇస్తున్నది. సీఎం కేసీఆర్తోనే ఇది సాధ్యమైంది. లాటరీలో కూడా మాకు ఇల్లు రావాలని కోరుకుంటున్న.
– కాంపెల్లి హేమలత, మందమర్రి
సీఎం కేసీఆర్కు పేదల కష్టాలు తెలుసు..
సీఎం కేసీఆర్కు పేదల కష్టాలు తెలుసు. అందుకే డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తున్నరు. ఎన్నో ఏండ్లుగా సొంతింటి కోసం ఎదురు చూస్తున్నాం. అధికారులు ప్రకటించిన అర్హుల జాబితాలో నా పేరు వచ్చింది. ఆనందంగా అనిపించింది. ఇది వరకు జరిగిన సమావేశాల్లో విప్ బాల్క సుమన్ సార్ డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపు పూర్తి పారదర్శకంగా ఉంటుందని చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే నిరుపేద కుటుంబానికి చెందిన నా పేరు వచ్చింది.
– చెరుకు రాధా, మందమర్రి
ఇంత మంచి ఇండ్లు కట్టించలే..
డబుల్ బెడ్రూం ఇండ్ల అర్హుల జాబితాలో నా పేరు వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేదలకు చేస్తున్న మేలు మరువ లేనిది. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత మంచి ఇండ్లు కట్టించింది లేదు. ఇది వరకున్న సర్కారోళ్లు పైరవీకారులకే మేలు చేసేటోళ్లు. ఇప్పుడలా కాదు. అధికారులు ఇంటింటి సర్వే చేసి అర్హుల జాబితా తయారు చేశారు. లాటరీ పద్ధతిలో కూడా మాకు ఇల్లు వస్తుందని ఆశిస్తున్నా.
– ఎరుకల లక్ష్మి, మందమర్రి