దండేపల్లి : మహిళా సాధికారతే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. దండేపల్లి మండలంలోని రెబ్బెన్పల్లిలో రూ.5లక్షలతో నిర్మించిన డ్వాక్రా సంఘ భవనాన్ని ఆయన స్థానిక నాయకులతో కలిసి ఆదివారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మహిళ ఆర్థికంగా సాధికారత సాధించి సొంత కాళ్లపై నిలబడేలా చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మహిళలు సంఘాల ద్వారా నూతనంగా వ్యాపారాలు చేసి ఆర్థిక పురోగతిని సాధించాలని సూచించారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తుందన్నారు.గ్రామానికి మంజూరైన నూతన వంతెన పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ గురువయ్య, పీఏసీఎస్ చైర్మన్ కాసనగొట్టు లింగన్న, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రేని శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ కందుల కల్యాణి, ఎంపీటీసీ బత్తుల మౌనిక, వివిధ గ్రామాల సర్పంచులు జాడి తిరుపతి, విఠల్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు చుంచు శ్రీనివాస్, పీఆర్ జేఈ తివారీ, టీఆర్ఎస్ నాయకులు, ఐకేపీ ఏపీఎం, సీఏలు, మహిళా సంఘాల సభ్యులు, తదితరులు ఉన్నారు.