శ్రీరాంపూర్ : శ్రీరాంపూర్ నుంచి అక్రమంగా తరలిస్తున్న నిషేదిత పొగాకు (గుట్కా)లను బుధవారం శ్రీరాంపూర్ బస్టాండ్ వద్ద టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. టాస్క్ఫోర్స్ సీఐ మహేందర్, ఎస్ఐ లచ్చన్నలు శ్రీరాంపూర్ కాలనీ వద్ద చెన్నూరు వైపు వెళుతున్న ఆటోను ఆపి తనిఖీ చేయగా అక్రమంగా తరలిస్తున్న పొగాకు గుట్కాలు పట్టుబడినట్లు పేర్కొన్నారు. వీటి విలువ 40వేల రూపాయల వరకు ఉంటుందన్నారు.
మంచిర్యాల ఆదిత్య కిరాణం సునిల్ శర్మ వద్ద తీసుకొని వచ్చానని నిందితులు పేర్కొన్నారు. గుట్కాను తరలిస్తున్న ఎండీ సాజిద్ (మంచిర్యాల), సునిల్ శర్మ (మంచిర్యాల)ను పట్టుకున్నామని చెప్పారు. అక్రమ గుట్కాలు, ఆటోను శ్రీరాంపూర్ పోలీసులకు అప్పగించామని వారు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. ఈ దాడిలో టాస్క్ఫోర్స్ పోలీసులు సంపత్, భాస్కర్గౌడ్, శ్రీనివాస్, రాకేశ్ పాల్గొన్నారు.