గర్మిళ్ల, డిసెంబరు 12 : మహిళల భద్రత కోసమే ప్రభుత్వం షీ టీంలను ఏర్పాటు చేసిందని మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఆల్ఫోర్ జూనియర్ కళాశాలలో పోలీసుల ఆధ్వర్యంలో షీ టీం సేవలపై సోమవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన హాజరై మాట్లాడారు. వేధింపులు, ఈవ్ టీజింగ్కు గురయ్యే మహిళలు, యువతులు, విద్యార్థినులు షీ టీంను ఆశ్రయించాలని, లేదా డయల్ 100 కు కాల్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ తిరుపతి రెడ్డి, పట్టణ సీఐ నారాయణ, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐలు, కళాశాల సిబ్బంది, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలి
పోలీస్స్టేషన్కు వచ్చే ప్రజలతో స్నేహాపూర్వకంగా మెలగాలని మంచిర్యాల డీసీపీ అఖిల్మహాజన్ సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేశ్తో కలిసి ఏసీపీ, బెల్లంపల్లి రూరల్ సీఐ కార్యాలయం, తాళ్లగురిజాల పోలీస్స్టేషన్లను సో మవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేసుల వివరాలను ఎస్ఐ రాజశేఖర్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్స్టేషన్ ఆవరణలో ఏసీపీ , సీఐ బాబూరావ్తో కలిసి మొక్క నాటా రు. కార్యక్రమంలో తాండూర్, మందమర్రి , బెల్లంపల్లి సీఐలు జగదీశ్, ప్రమోద్రావ్, ముస్కె రాజుతో పాటు బెల్లంపల్లి టూటౌన్ ఎస్ఐ ఆంజనేయులు, తాళ్లగురిజాల పోలీస్స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.