తాండూర్, ఫిబ్రవరి 19 : మంచిర్యాల జిల్లాలో ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలన చేస్తోందని తాండూర్ మండల బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ అరెస్టుకు నిరసనగా గురువారం చేపట్టిన జిల్లా బంద్ తాండూర్ మున్సిపాలిటీలో సంపూర్ణమైంది. పలు వ్యాపార సంస్థలతో పాటు ప్రైవేటు విద్యాసంస్థలు బంద్ పిలుపునకు స్వచ్ఛందంగా మద్దతునిచ్చారు. ఈ సందర్భంగా గురువారం ఉదయం బీఆర్ఎస్ నాయకులు మండల కేంద్రంలో పర్యటించి నిరసన తెలిపారు.
అనంతరం బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. క్యాతనపల్లిలో బీఆర్ఎస్కు ప్రజలు సంపూర్ణ మెజారిటీ ప్రకటించారని తెలిపారు. కానీ కేవలం ఏడు స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ.. తన అధికార బలంతో అరాచకాలు సృష్టిస్తూ అడ్డదారిలో మున్సిపల్ పీఠం కోసం కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. దీన్ని అడ్డుకున్న బాల్క సుమన్పై లేనిపోని సెక్షన్లతో అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకుల అరాచకాలు, కుయుక్తులను ప్రజలు గమనిస్తున్నారని.. వారికి తగిన బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ పిలుపుతో స్వచ్ఛందంగా బంద్కు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దత్తుమూర్తి, మాజీ ఎంపీపీ పూసాల ప్రణయ్ కుమార్, ఇతర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
అనంతరం మాట్లాడుతూ క్యాతనపల్లి లో బీ ఆర్ ఎస్ కు సంపూర్ణ మెజారిటీ ఇచ్చిన ప్రజలు కేవలం 7 స్థానాలలో కాంగ్రెస్ ను తిరస్కరించినప్పటికి మంత్రి తన అధికార బలంతో అరాచకాలు సృస్టిస్తూ అడ్డ దారిలో కుర్చీ కోసం కుట్రలు చేస్తున్నాడని ఆరోపించారు. దీన్ని అడ్డుకున్న బాల్క సుమన్ పై లేనిపోని సెక్షన్లతో కేసులు పెట్టు జైలుకు పంపడం వారి దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. ప్రజలు కాంగ్రెస్ నాయకుల అరాచకాలు, కుయుక్తులు గమనిస్తున్నారని, ముందుముందు వారికి తగిన బుద్ధి చెప్తారని అన్నారు. పార్టీ పిలుపుకు స్వచ్చందంగా సహకరించిన అందరికి నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.