మంచిర్యాల : ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన మేలు ఎప్పటి మర్చిపోమని, జీవితాంతం గుర్తుంచుకుంటామని వరద బాధితులు అన్నారు. మంచిర్యా జిల్లా చెన్నూరు మండలంలోని సోమన్ పల్లి గ్రామం వద్ద గురువారం గోదావరి నదిలో చిక్కుకొన్న సారయ్య, గట్టయ్యలను ఎమ్మెల్యే సుమన్ కాపాడారు.
మంత్రి కేటీఆర్, ఇతర అధికారుల సహకారంతో హెలికాప్టర్ తెప్పించి గోదావరిలో చిక్కుకున్న ఇద్దరి ప్రాణాలను రక్షించారు. దీంతో బాధితులు చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం వారు విప్ సుమన్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అండగా నిలిచిన ప్రభుత్వానికి, మంత్రి కేటీఆర్, విప్ సుమన్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.