మంచిర్యాల : జిల్లాలోని మందమర్రి, నస్పూర్, బెల్లంపల్లి మున్సిపాలిటీలలో ఖాళీగా ఉన్న సింగరేణి క్వార్టర్స్ను పేద ప్రజలకు అందించడానికి వీలుగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి అందజేయాలని సింగరేణి సీఎండీ శ్రీధర్కు ప్రభుత్వ విప్ బాల్క సమన్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లోని సింగరేణి భవన్లో సీఎండీ శ్రీధర్తో బాల్క సుమన్ సమావేశమయ్యారు.
జీవో -76లో భాగంగా రామకృష్ణాపూర్ పట్టణంలో గతంలో చేసిన సర్వేలో పలు కారణాల వల్ల మిస్సయిన భగత్ సింగ్ నగర్, రాజీవ్ నగర్, శివాజీ నగర్, జవహర్ నగర్, శ్రీనివాస్ నగర్, మల్లికార్జున నగర్, గంగా కాలనీ, విద్యానగర్, ఆర్కే 4 గడ్డ, పోస్ట్ ఆఫీస్ లైన్ లకు చెందిన భూముల క్రమబద్ధీకరణ చేసేందుకు రెవెన్యూ డిపార్ట్మెంట్కు అవకాశం కల్పించాలని ఆయన కోరారు.
అలాగే మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల సింగరేణి వార్డుల్లో పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరిగేలా సింగరేణి అధికారులు చొరవ చూపాలని, శ్రీధర్ దృష్టికి విప్ సుమన్ తీసుకెళ్లారు.