మంచిర్యాల అర్బన్, జనవరి 13 : కరోనా మహమ్మారి ప్రభావంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెల్లరేషన్ కార్డులున్న కుటుంబాలకు రేషన్ షాపుల ద్వారా ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేస్తూ మూడేళ్ల పాటు ఆదుకుంటూ వస్తున్నది. తాజాగా దానిని మరో మూడు నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో లబ్ధిదారులకు మరింత ఊరట కలిగినైట్లెంది. మరోవైపు ఉచిత బియ్యం పంపిణీ ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు యూనిట్కు ఆరు కిలోల చొప్పున ఉచిత రేషన్ పంపిణీ కొనసాగే అవకాశాలున్నాయని సివిల్ సైప్లె అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉచిత రేషన్ పంపిణీని కొనసాగించడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పేద వర్గాలకు ఉపయోగకరంగా..
ఉచిత బియ్యం పంపిణీ పేద ప్రజలకు ఆసరా అయ్యింది. కరోనా సమయంలోనే దొడ్డు, సన్న బియ్యం పంపిణీ చేసింది. డీలర్లకు వచ్చే కోటాను బట్టి కొంత సన్న బియ్యం, మరికొంత దొడ్డు బియ్యం అందజేస్తూ వస్తున్నారు. మరోవైపు జనవరి నెల కోటాకు సంబంధించి ఇప్పటికే ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ షాపులకు బియ్యం చేరుకున్నాయి.
ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున..
కరోనాతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండడంతో మొదట ఒక్కొక్కరికీ 15 కిలోల చొప్పున ఉచితంగా రేషన్ బియ్యాన్ని అందజేసింది. తర్వా త 10 కిలోలకు, ప్రస్తుతం దానిని 5 కిలోలకు తగ్గించి ఉచితంగానే పంపిణీ చేస్తుంది. అలాగే అంత్యోదయ కార్డుదారులకు 35 కిలోల బి య్యాన్ని కూడా ఉచితంగా అందజేస్తున్నారు.
జనవరి కోటా 26,93,066 కిలోలు..
జిల్లాలోని 18 మండలాల పరిధిలో 423 చౌకధరల దుకాణాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 2, 19,723 రేషన్ కార్డులుండగా 6,43,358 యూ నిట్లు ఉన్నాయి. ఇందులో ఆహార భద్రత కార్డులు (ఎఫ్ఎస్సీ) 2,04,157కి (5,96,659 యూనిట్లకు)గాను 22,44,299 కిలోల బియ్యం, అంత్యోదయ ఆహార భద్రత కార్డులు (ఏఎఫ్ఎస్సీ) 15,406 కు (46,538 యూనిట్లకు) గాను 4,48,097 కిలోలు, అన్నపూర్ణ (ఏఏపీ) కార్డు లబ్ధిదారులు 160 మందికి (161 యూనిట్లకు)గాను 67 కిలోల బియ్యం పంపిణీ చేయనున్నా రు. జనవరి నెలకు 26,93,066 కిలోల (2693.066 మెట్రిక్ టన్నులు) బియ్యం తెల్ల రేషన్ కార్డు దారులకు పంపిణీ చేయనున్నారు.
జనవరి నెల ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభం
జనవరి నెలకు సంబంధించి ఉచిత రేషన్ బి య్యం పంపిణీని గత బుధవారం నుంచే ప్రా రంభించాం. ఒక్కొక్కరికీ ఐదు కిలోల చొప్పున బియ్యం అందిస్తున్నాం. లబ్ధిదారులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉచిత రేషన్ బియ్యాన్ని తీసుకువెళ్లాలి. మార్చి వరకు యూనిట్కు ఐదు కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తాం. అనంతరం ప్రభుత్వ ఆదేశాల మేరకు పంపిణీ జరుగుతుంది.
– ప్రేం కుమార్, జిల్లా పౌరసరఫరాల అధికారి, మంచిర్యాల