మంచిర్యాలటౌన్, జనవరి 13: ఇండ్ల పట్టాల విషయంలో దళారులను నమ్మి మోసపోవద్దని మం చిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు సూచించారు. తెలంగాణ ప్రభుత్వం జీవో నంబర్ 58 ప్రకారం ప్రభుత్వ స్థలాల్లో 125 గజాల్లోపు ఏళ్ల తరబడి నివసిస్తున్న కుటుంబాలకు భూ పట్టాలను శుక్రవారం లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ పట్టణాల్లో ఏళ్ల తరబడి ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు పట్టాలు అందించాలని నిర్ణయించారన్నారు. మేరకు మంచిర్యాల, నస్పూర్ పట్టణాలలో 35 మందికి పట్టాలను పంపిణీ చేశామన్నారు. ఇవేగాకుండా ఎన్నో పథకాలు అమలు చేస్తూ దేశానికి మన రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తున్నాదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు బోరిగం శ్రీనివాస్, పోరెడ్డి రాజు, అంకం నరేశ్, మంచిర్యాల, నస్పూర్ తహసీల్దార్లు రాజేశ్వర్, జ్యోతి, ఆర్ఐ అజీజ్, సీనియర్ అసిస్టెంట్ శ్రీహరి, బీఆర్ఎస్ నాయకులు రవీందర్రావు, సాయి తదితరులు పాల్గొన్నారు.
అన్ని రంగాల్లో పట్టణాభివృద్ధి
మంచిర్యాల పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే దివాకర్రావు అన్నారు. ‘ఇంటింటికీ బీఆర్ఎస్’ లో భాగంగా మున్సిపల్ పరిధిలోని 18వ వార్డు భగవంతంవాడలో శుక్రవారం ఇంటింటికీ తిరుగుతూ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంగా ఏర్పడిన మంచిర్యాలలోని వార్డుల్లో అవసరమైన పనులను ప్రాధాన్యతా క్రమంలో చేపడుతున్నామన్నారు. వార్డు కౌన్సిలర్ హఫీజా బేగం, కౌన్సిలర్ సుదమల్ల హరికృష్ణ, నాయకులు తోట తిరుపతి, తాజుద్దీన్ పాల్గొన్నారు.