మంచిర్యాల : మానవాళి మనుగడకు మొక్కల పెంపకం అవసరమని, పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించాలంటే ఎక్కువ శాతం చెట్లను పెంచాలని మంచిర్యాల జోన్ ఇంచార్జి డీసీపీ అఖిల్ మహాజన్ అన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే అఖిల్ మహాజన్ను నామినేట్ చేశారు.
దీంతో స్పందించిన అఖిల్ మహాజన్ పెద్దపల్లి డీసీపీ కార్యాలయం ఆవరణలో మూడు మొక్కలు నాటి వాటితో సెల్ఫీ దిగారు. అనంతరం మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా చాలెంజ్ సవాల్ విసిరారు. కార్యక్రమంలో పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్, ఎస్ఐ రాజేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.