కాసిపేట, ఫిబ్రవరి 4 : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని బెల్లంపల్లి రేంజ్ ముత్యంపల్లి అటవీ సెక్షన్లో అడవి పందుల వలన పంట నష్టపోయిన రైతులకు అటవీశాఖ ఆధ్వర్యంలో నష్టపరిహారం చెల్లించిన్నట్లు బెల్లంపల్లి ఫారెస్ట్ రేంజర్ పూర్ణ చందర్ తెలిపారు. గత నవంబర్, డిసెంబర్ నెలలో కాసిపేట మండలం మల్కెపల్లి, చింతగూడ గ్రామాల్లో అడవి పందుల దాడిలో రైతుల పంట నష్టం కాగా వివరాలను అటవీ శాఖ, వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు సంయుక్తంగా సర్వే చేసి నివేదికనుపై అధికారులకు పంపారు.
అధికారులు 10 మంది రైతులకు రూ.36,137 వారి బ్యాంక్ ఖాతాలో నష్ట పరిహారాన్ని జమ చేసినట్లు అటవీ క్షేత్రాధికారి పూర్ణ చందర్ తెలిపారు. ఈ సందర్భంగా రైతులు అటవీ జంతువుల నుండి పంట రక్షణ కోసం సోలార్ ను వాడాలని, విద్యుత్ వైర్లు పెట్టకూడదని, అటవీజంతులకు హాని కలిగించకూడదన్నారు. పంట నష్టం జరిగిన వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.