మంచిర్యాల అర్బన్(హాజీపూర్) : హాజీపూర్ మండలంలోని ర్యాలీ, చిన్న ఘడ్పూర్ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ మాజీ అధ్యక్షుడు గురం సత్తి రెడ్డి, వార్డు మెంబర్ కొండ్ర చంద్రమౌళి, విద్యా కమిటీ మాజీ చైర్మన్ బొజ్జ నర్సయ్యలతో పాటు మరో 30 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు సమక్షంలో ఆదివారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యాక్రమాలకు ఆకర్శితులై ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని పేర్కొన్నారు.
కొత్తగా పార్టీలో చేరిన వారు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మొగిలి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ లక్ష్మయ్య, పీఏసీఎస్ చైర్మన్లు సందెల వెంకటేశ్, మల్రాజు రామారావు, రైతు సమన్వయ సమితి కన్వీనర్ పూస్కూరి శ్రీనివాస్ రావు, మాజీ వైస్ ఎంపీపీ మందపల్లి శ్రీనివాస్, ఆయా గ్రామాల సర్పంచులు రాజు, భీంరావు, లక్ష్మీ భూమయ్య, సోనే రావు తదితరులు పాల్గొన్నారు.