హాజీపూర్ : మండలంలోని పెద్దంపేట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నాయకుడు ప్రేమ్ రావ్, కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు సుధాకర్ తన అనుచరులతో కలిసి శనివారం టీఆర్ఎస్ పార్టీలో చేశారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే దివాకర్రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మంచికి మారుపేరు మంచిర్యాల అని అలాంటి మంచిర్యాలలో గుండాలకు, రౌడీలకు ప్రజలు స్థానం కల్పించడం లేదన్నారు. తప్పు చేసిన వారిని ఎప్పటికి ప్రజలు క్షమించరని తెలిపారు. తాను చేసిన సవాల్కు మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్సాగర్ రావు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
తప్పు చేయకుండా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాలని సూచించారు.ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనుల పట్ల ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, హాజీపూర్ టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మొగిళి శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్లు మల్రాజు రామారావు, కొట్టె సత్తయ్య, వెంకటేశ్, మండల ప్రధాన కార్యదర్శి మాధవరపు జీవన్ రావు, ఉపాధ్యక్షుడు అల్లం నాగయ్య, యువత ప్రధాన కార్యదర్శి హరీశ్ గౌడ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గోళ్ళ శ్రీనివాస్, సర్పంచులు అనె మల్లేశ్, కొట్టె మహేందర్, ఎంపీటీసీ వెంకటేశ్, గ్రామ కమిటీ అధ్యక్షుడు తిరుపతి, మండల నాయకులు వోలపు రమేశ్, బేతు రవి, తదితరులు పాల్గొన్నారు.