భైంసా/కుభీర్, డిసెంబర్ 22 : భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) విస్తరణలో భాగంగా గురువా రం మహారాష్ట్రలో అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పర్యటించారు. పాలజ్, కీని గ్రామాల్లో బ్యానర్లు కట్టి, మంగళహారతులు ఇచ్చి ప్రజలు, మహిళలు అపూర్వ స్వాగతం పలికారు. స్థానిక నాయకులు మహిళలు దారి పొడువునా టపాకులు, బాణా సంచా కాల్చుతూ, బ్యాండ్ మేళాల మధ్య స్వాగ తం పలికారు. కాలినడకన వెళ్తున్న మంత్రి, ఎమ్మెల్యేలను పుష్పగుచ్ఛాలు అందించి, శాలు వాలతో సత్కరించారు.
బీజేపీకి చరమగీతం పాడేది బీఆర్ఎస్సే..
దేశంలో బీజేపీ అరాచక పాలనకు చరమగీతం పాడేది బీఆర్ఎస్ పార్టీయేనని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ విస్తరణ భాగంగా మంత్రి మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా భోకర్ తాలుకాలోని కీని గ్రామాన్ని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలోని సీఎం కేసీఆర్ సారథ్యంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశమంతటా అమలు పరిచేందుకు గానూ భారత రాష్ట్ర సమితి ని ఏర్పాటు చేశారని తెలిపారు. కేసీఆర్ దీక్ష, దక్షత కలిగిన నాయకుడిగా దేశంలోనే గుర్తింపు పొందారని తెలిపారు. తెలంగాణలో రైతుబంధు, రైతుబీమా అందిస్తున్నట్లు దేశమంతటా అందించాలన్న ధృడసంకల్పంతో అప్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. అప్పుడే గ్రామ స్తులు పాలజ్ వచ్చే రహదారి బాగు చేయాలని కోరగా ఇప్పుడే ఇంజినీర్తో మాట్లాడానని రూ. 2.50 కోట్లు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు, త్వరలో డబుల్ లేన్ రోడ్ల నిర్మాణానికి మరో రూ. 8 కోట్లు మంజూరుకు కృషి చేస్తామన్నారు. కీనిలో ఉన్న వైద్యులు కార్యక్రమం ఏర్పాటుకు సహకరించడంపై ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి ఉన్నారు.
దారిపొడవునా స్వాగతం
భైంసాలోని పిప్రి కాలనీతో పాటు సరిహద్దు గ్రామాలైన పల్సి, సిర్పెల్లి, సొనారి, మహారాష్ట్ర లోని పాలజ్, కీని తదితర గ్రామాల ప్రజలు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి, ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. సొనారి, పల్సి, సిర్పెల్లి, పాలజ్ సరిహద్దు, పాలజ్, కీని గ్రామాల్లో రహదారి పొడవునా బ్యానర్లను కట్టి అపూర్వ స్వాగతం పలికారు. పల్సి గ్రామంలో స్థానిక సర్పంచ్ కవితా రాజేశ్చారి, మండల నాయకులు గజ్జలవ్వ ఆలయం వద్ద కాన్వాయ్ ని ఆపి వారికి ఘన స్వాగతం పలికారు. పాఠశాల విద్యార్థులు మంత్రి, ఎమ్మెల్యేలకు పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. సిర్పెల్లిలో గంట ఆనంద్ ఆధ్వర్యంలో యువకులు, గ్రామ స్తులు, మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు వద్ద మహారాష్ట్ర పోలీసులు స్వాగతం పలికారు. అంత లోనే మహారాష్ట్ర ఆర్టీసీ బస్, డ్రైవర్ కండక్టర్లు మంత్రి ఐకే రెడ్డి దగ్గరకు వచ్చి తెలంగాణ మహా రాష్ట్ర సరిహద్దు వరకు గల రహదారి అసంపూర్తిగా ఉందని దానిని పూర్తి చేయించాలని కోరారు. కీనిలోని గ్యాస్ ఏజెన్సీలో సునీల్ అనే న్యాయ వాది మంత్రిని పూలమాల శాలువాతో సత్క రించారు. కీని గ్రామస్తులు అక్కడి నుంచి పటాకు లు కాల్చుతూ బ్యాండ్ మేళాలతో కాలినడకన సమావేశం జరిగే వేదిక వద్దకు తీసుకెళ్లారు.
కినీ, పాలజ్లో పలువురి చేరిక
భారత్ రాష్ట్ర సమితికి మహారాష్ట్రలో ప్రజలు ఆకర్షితులవుతున్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో కినీ, పాలజ్ గ్రామాల నాయకులు స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గులాబీ కండువాలు వేసి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు మంత్రి, ఎమ్మెల్యేలు వినాయకుని ఆలయంలో పూజలు నిర్వహించి బయటకు రాగానే వారిని కలిసిన సంజయ్ రౌతు తాను బీఆర్ఎస్ పార్టీలో చేరుతానని చెప్పారు. దీంతో స్పందించిన మంత్రి ఐకే రెడ్డి బీఆర్ఎస్ కండువా కప్పి వేసి పార్టీలోకి ఆహ్వానించారు. తనతో పాటు 50 మంది తన సన్నిహితులు పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. కీనిలో జరిగిన సభలో పార్టీలో చేరిన వారిలో శ్రీనివాస్ ఉప్పువాడ్, గోవింద్, ప్రశాంత్, సాయి, డా. నర్సింగ్తో పాటు 50 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
కేంద్రం తీరు సరైంది కాదు..
కేంద్ర ప్రభు త్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై రైతులు, సామాన్య ప్రజలు పోరాడాల్సిన అవ సరం ఉందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. క్యాంపు కార్యాలయంలో గురు వారం మంత్రి మీడియాతో మాట్లాడారు. కల్లాల నిర్మాణం పూర్తయ్యాక, వ్యవసాయ కల్లాలకు వినియోగించిన ఉపాధి హామీ నిధు లు తిరిగి ఇవ్వమనడం సరైంది కాదని.. ఆ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డి మాండ్ చేశారు. కేంద్రం అవలంభిస్తున్న రైతు, వ్యవసాయ కూలీల వ్యతిరేక విధానాలకు నిరసనగా శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టే ధర్నా కార్యక్రమాలకు రైతులు, పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో హాజరు కావాలని కోరారు.