దండేపల్లి, ఏప్రిల్ 26 : రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మోసపూరిత కాంగ్రెస్, బీజేపీలను తరిమికొట్టాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు పిలుపుని చ్చారు. శుక్రవారం దండేపల్లి మండలంలోని ధర్మరావు పేట, పెద్దపేట, గుడిరేవు గ్రామాల్లో పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు మద్దతుగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మోసపూరిత హామీలతో అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ను నమ్మి మరోసారి మోసపోవద్దని సూచించారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొని.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఏ కష్టమొచ్చినా మీ ముందుంటానని, కేసీఆర్ నాయక త్వాన్ని బలపర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అనిల్, పీఏసీఎస్ చైర్మన్ కాసనగొట్టు లింగన్న, వైస్ చైర్మన్ అక్కల రవి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు , తదితరులు పాల్గొన్నారు.