చెన్నూర్, సెప్టెంబర్ 23: 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా వేసుకోవాలని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి సూచించారు. చెన్నూర్ పట్టణంలోని వ్యాక్సినేషన్ కేంద్రాలను ఆమె గురువారం సందర్శించారు. కొవిడ్ టీకాలపై అపోహలు వీడి, 18 సంవత్సరాల పైబడిన వారంతా టీకాలు తీసుకోవాలని సూచించారు. వైద్య, ఆరోగ్య సిబ్బంది తమ సమీపంలోకి వచ్చే టీకాలు అందిస్తున్నారని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. వంద శాతం వ్యాక్సినేషన్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్ పర్చన్ అర్చనా గిల్డా, వైస్ చైర్మన్ నవాజొద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయినొద్దీన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
చెన్నూర్, సెప్టెంబర్ 23: చెన్నూర్ పట్టణంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ భారతీ హోళికేరి అధికారులను ఆదేశించారు. పట్టణంలోని కుమ్మరి కుంట మినీ ట్యాంకు బండ్ పనులను, ప్రధాన రహదారి విస్తరణ పనులను ఆమె గురువారం పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్ పర్సన్ అర్చనా గిల్డా, వైస్ చైర్మన్ నవాజొద్దీన్, తహసీల్దార్ శ్రీనివాసరావు దేశ్పాండే, కమిషనర్ ఖాజా మొయినొద్దీన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
అర్హులందరికీ వ్యాక్సిన్ అందించాలి : డీఎంహెచ్వో
చెన్నూర్ రూరల్, సెప్టెంబర్ 23: గ్రామాలలో 18 ఏండ్ల వయస్సు నిండిన వారందరికీ కొవిడ్ వ్యాక్సిన్ అందేలా చూడాలని సంబంధిత అధికారులు, సిబ్బందిని డీఎంహెచ్వో సుబ్బారాయుడు ఆదేశించారు. మండలంలోని అంగ్రాజ్పల్లి పీహెచ్సీని ఆయన గురువారం పరిశీలించారు. మారుమూల గ్రామాల్లో సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం ఓపీ రికార్డులను పరిశీలించారు. వ్యాక్సినేషన్, కొవిడ్ టెస్ట్ల వివరాలు తెలుసుకున్నారు. ఏఎన్ఎంలు గ్రామస్తులకు అందుబాటులో ఉంటూ సేవలందించాలన్నారు. దవాఖానలో ప్రసవాల సంఖ్యపెంచాలని తెలిపారు. వైద్య సిబ్బందికి సూచనలను, సలహాలను అందజేశారు. ఆయన వెంట హెచ్ఈవో జగదీశ్, వైద్య సిబ్బంది ఉన్నారు.
నెన్నెల మండలంలో..
నెన్నెల, సెప్టెంబర్ 23: మండలంలోని నందులపల్లిలో కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని జిల్లా ఉప వైద్యాధికారి విజయ పూర్ణిమ పరిశీలించారు. వ్యాక్సినేషన్ వివరాలు తెలుసుకున్నారు. ఆమె వెంట సూపర్వైజర్ వెంకట రమణ, మెర్సి , కార్యదర్శి పద్మనాభం, ఏఎన్ఎం ఇందిర, తదితరులునారు.