భీమారం, ఏప్రిల్ 27 : మంచిర్యాల జిల్లా కేంద్రం నుంచి మహారాష్ట్రకు టాటా ఏస్లో అక్రమంగా తరలిస్తున్న రూ. 2 లక్షల విలువైన మద్యాన్ని పట్టుకున్నట్లు టాస్క్ఫోర్స్ సిబ్బంది, స్థానిక పోలీసులు పట్టుకున్నారు. శనివారం ఉదయం భీమారం శివారులోని మంచిర్యాల – చెన్నూర్ జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహిస్తుండగా, కోటపల్లి మండలం అన్నారంకు చెందిన మహ్మద్ షరీఫ్, అదే గ్రామానికి చెందిన రమణయ్య టాటా ఏస్లో తరలిస్తున్న 25 కాట్లన్ల మద్యంతో పాటు రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ ఎస్ఐ లచ్చన్న, ఎస్ఐ రాములు, సిబ్బంది సంపత్, తిరుపతి, భాస్కర్ గౌడ్ పాల్గొన్నారు.