మంచిర్యాల ఏసీసీ, జనవరి 3 : మంచిర్యాలలో నిర్మించబోయే వైద్య కళాశాల భవనాల కోసం జిల్లా మెడికల్ ఎడ్యుకేషన్ అధికారి రమేశ్రెడ్డి మంగళవారం పలుచోట్ల స్థలాలను పరిశీలిం చారు. సాయికుంట, నూతన కలెక్టరేట్ ఏరియా సమీపంలోని 14 ఎకరాలను చూసిన ఆయన, ఎక్కడ నిర్మించ బోయేది త్వరలోనే చెబుతామని తెలిపారు.
అనంతరం ఇటీవల వరదల్లో మునిగిన మాతాశిశు సంరక్షణ కేంద్రం, పాత కలెక్టరేట్ భవనాన్ని పరిశీలించారు. వీటిని వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.