కుమ్రం భీం ఆసిఫాబాద్ : ఆదివాసులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవని ఎస్పీ కె.సురేశ్ కుమార్ అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం జిల్లా కేంద్రంలో గల ఆదివాసీ భవన్లో ప్రపంచ ఆదివాసీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్య ద్వారా సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు.
విద్యతోనే మనిషికి సమాజంలో ఉన్నతమైన గౌరనం ఉంటుందని పేర్కొన్నారు. అనుకున్న లక్ష్యాన్ని పట్టుదలతో చదివితే విజయం సాధించవచ్చని ఆయన సూచించారు. ఆదివాసీ విద్యార్థులు ఉన్నతమైన విద్యను అభ్యసించి, గొప్ప స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి, కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.