కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు కెరమెరి మండలంలో తెగిపోయిన తుమ్మగూడ బ్రిడ్జిని జెడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి పరిశీలించారు. బ్రిడ్జి మరమ్మతులు వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు దిగువ ప్రాంతంలో ఉండే వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండండి. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని ఆమె సూచించారు. ఈదురు గాలులతో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడే ప్రమాదం ఉంది. అలాగే లోతట్టు ప్రాంతాలకు దూరంగా ఉంటూ తగిన జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ కార్యకర్తలు ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి ప్రజలకు అవసరమైన సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు.