మందమర్రి మార్చి29 : వోకల్ ఫర్ లోకల్ అనే అంశంపై ఢిల్లీ పార్లమెంట్ సెంట్రల్ హాలులో ప్రసంగించిన చంద్ర ప్రణీతను ఆర్యవైశ్య, యువజన సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. వరంగల్ పింగళి ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ చదువుతున్న ప్రణీత జాతీయ క్రీడలు, యువజన శాఖ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన నేషనల్ యూత్ ఫెస్టివల్లో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిందని సంఘం నాయకులు తెలిపారు. ప్రథమ స్థానంలో నిలిచిన వారికి నిర్వహించిన పోటీల్లో ప్రణీత ఢిల్లీ పార్లమెంట్ సెంట్రల్ హాలులో ప్రసంగించిందన్నారు. స్థానిక అంగడిబజార్ ఏరియాలోని తన బంధువుల ఇంటికి వచ్చిన ప్రణీత ప్రతిభను గుర్తించిన ఆర్యవైశ్య సంఘాల నాయకులు సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షు డు రావికంటి వెంకటేశ్, నాయకులు రాచ ర్ల రవికుమార్, రాచర్ల గణేశ్, నోముల చంద్రశేఖర్, కోలేటి శివ, రంగు గురువయ్య, చీకోటి కాంతయ్య, కేసెట్టి సత్త య్య, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
పేమెంట్ సెటిల్మెంట్లకు క్రిప్టో కరెన్సీ: వీసా
ఒబామా నాయినమ్మ, సంఘసేవకురాలు మమా సారా కన్నుమూత