జైనూర్, జనవరి 20 : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో ఈనెల 21న నిర్వహించబోయే విద్యుత్ సమస్యల పరిష్కారానికి విద్యుత్ వినియోగదారుడు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని. ఏడీఈ డి. శ్రీనివాస్ ఒక ప్రకటనలో కోరారు. బుధవారం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహి స్తారన్నారు.
విద్యుత్ సమస్యల పరిష్కార కార్యక్రమానికి సిజిఆర్ఎఫ్ చైర్మన్ నారాయణ, సిజిఆర్ఎఫ్ మెంబర్స్ రామకృష్ణ, కిషన్, రాజ గౌడ్ వస్తున్నట్లు ఆయన తెలిపారు. జైనుర్ మండల కేంద్రంగా నిర్వహించబోయే ఈ కార్యక్రమానికి జై నూర్ కెరమెరి, తిర్యాని, సిర్పూర్ (యు), లింగాపూర్ మండలాల విద్యుత్ వినియోగదారులు తమ విద్యుత్ సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన కోరారు.