పెంబి, అక్టోబర్ 22: రానున్న ఎన్నికల్లో తన ను ఆదరించి గెలిపిస్తే ఖానాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని బీఆర్ఎస్ అభ్య ర్థి భూక్యా జాన్సన్ నాయక్ అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం దుర్గామాత నవరాత్రోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆనంతరం మండల కేంద్రం నుంచి లోతోర్యతండా గ్రామం వరకు బైక్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం వాలీబాల్ క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు. బీఆర్ఎస్తోనే అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమవుతుందన్నారు. కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సల్లా నరేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ గంగారెడ్డి, సర్పంచ్లు పూర్ణచందర్, సుధాకర్, మహేందర్, తానాజీ, బీఆర్ఎస్ నాయకులు బడుగు మల్లేశ్, భూక్యా గోవింద్, బానవత్ విలాస్, సుతారి మహేందర్, కొడగంటి నర్సయ్య , ధర్మేందర్, పరుశురాం, భూమాగౌడ్, గాండ్ల శంకర్, బోసు శ్రీనివాస్
తదితరులు పాల్గొన్నారు.
దస్తురాబాద్, అక్టోబర్ 22: మండలంలోని రేవోజీపేట, మున్యాల, దస్తురాబాద్ గ్రామాల్లో కొలువుదీరిన దుర్గామాతలను ఆదివారం ఖానాపూర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్ దర్శించుకున్నారు. అర్చకులు ఆయనకు ఆశ్వీరచనం అందజేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారి కండువాను కప్పి సన్మానించారు. జడ్పీటీసీ సంతపురి శారదా శ్రీనివాస్, ఎంపీపీ సింగరి కిషన్, పీఏసీఎస్ చైర్మన్ రామడుగు రమేశ్ రావు, సర్పంచులు నిమ్మతోట రాజమణిశివయ్య, దుర్గం శంకర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి ముడికే ఐలయ్య యాదవ్, అర్గుల రాజనర్సయ్య, నాయకులు దాసరి సుధాకర్, కొక్కుల రాజేశం, ఎండపెల్లి గంగన్న, బొమ్మెన గోపి, కమలాకర్ గౌడ్, నర్సయ్య, పాల్గొన్నారు.
ఖానాపూర్ రూరల్ అక్టోబర్ 22: ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ జెండాను ఎగురవేయాలని బీఆర్ఎస్ ఖానాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్ అన్నారు. ఖానాపూర్ మండలంలోని (కె) బావాపూర్ గ్రామంలో అదివారం ఆయన ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేండ్ల క్రితం గ్రామాలన్ని అంధకారంలో ఉన్నాయని, తెలంగాణ వచ్చాక అబివృద్ధిలో కళకళ లాడుతున్నయన్నారు. ప్రభుత్వ పథకాలను వివరించారు. కారు గుర్తుకు ఓటు వేసి గ్రామాల్లో మరింత అభివృద్ధికి సహకరించాలని గ్రామస్తులను కోరారు. ఎంపీపీ అబ్ధుల్ మోహిద్, సర్పంచ్ బీర్ల లక్ష్మీనర్సయ్య, పీఎసీఎస్ చైర్మన్ అమంద శ్రీనివాస్, నాయకులు కుతుబుద్దీన్, రాజగంగన్న, దాసరిగొండ మల్లయ్య, టేకు మధు, సీర్ల రాజన్న, గ్రామస్తులు పాల్గొన్నారు
కడెం, అక్టోబర్ 22: యువత క్రీడల్లో రాణించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి భూక్యా జాన్సన్నాయక్ అన్నారు. కడెం మండలకేంద్రంలో ఆదివారం నిర్వహించిన క్రికెట్ (కడెం క్రికెట్ లీగ్) కేపీఎల్ ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. కడెం మండలకేంద్రానికి చెందిన ఫరీద్ అహ్మద్ (బాబు) ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా, ఆయన స్మారకార్థం పోటీలు నిర్వహించారు. విజేత జట్టుకు రూ. 15 వేలతో పాటు, కప్, మెడల్స్ అందశారు. రన్నర్కు రూ. 10 వేలతో పాటు కప్, మెడల్స్ అందజేశారు.
మంచిర్యాల జిల్లా జన్నారం మండలానికి చెందిన మాదిడి పూర్ణచందర్రావు ఈ నగదును అందజేశారు. ఎంపీపీ అం థోని అలెగ్జాండర్, జడ్పీటీసీ పురపాటి శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ కొండపురం అనూష, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జొన్నల చంద్రశేఖర్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు రఫీక్హైమద్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు గోళ్ల వేణుగోపాల్, నాయకులు జడ ఇందూర్నేత, కొండాపురం లక్ష్మణ్, పీడీ వెంకటరమణ, ఆకుల లచ్చన్న, కొప్పుల లచ్చన్న, ఆజాం, పొద్దుటూరి సతీశ్రెడ్డి, పాలకూర్తి కృష్ణ, నిర్వాహకులు పూస శ్రీరాం, గౌసోద్దిన్, జాడి నర్సయ్య, షఫీయోద్దీన్, తదితరులున్నారు.