ఖమ్మం, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అందరికీ అన్నం పెట్టేది అన్నదాతలైతే.. ఆ అన్నదాతలను నిలబెట్టినది సీఎం కేసీఆర్ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రఘునాథపాలెం మండలం జింకలతండా రోడ్డులో రూ.15 కోట్లతో నూతనంగా నిర్మించిన 20 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములను ఆయన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్తో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ అనేక రాష్ర్టాల్లో వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా తగ్గాయని, తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదల రాకెట్లా దూసుకెళ్తున్నాయని అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులు దేశంలోనే కీలకపాత్ర పోషించబోతున్నాయని, ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణతో శీతల గిడ్డంగుల నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నామన్నారు. ఇప్పటి వరకు రూ.1.50 లక్షల కోట్లను సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసినట్లు చెప్పారు.
అన్నం పెట్టే అన్నదాతలకు ‘నేనున్నా’ననే భరోసా కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి.. కేసీఆర్ మాత్రమేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. ప్రజలందరికీ అన్నం పెట్టేది అన్నదాతలైతే.. ఆ అన్నదాతలను నిలబెట్టినది సీఎం కేసీఆర్ అని గుర్తుచేశారు. తెలంగాణ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రఘునాథపాలెం మండలం జింకలతండా రోడ్డులో రూ.15 కోట్లతో నూతనంగా నిర్మించిన 20 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్తో కలిసి శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. గడిచిన పదేళ్లలో దేశంలోని ఏ రాష్ట్రంలోనూ కొత్తగా గోదాముల నిర్మాణం జరిగిన దాఖలాలు లేవన్నారు. అనేక రాష్ర్టాల్లో వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా తగ్గాయని, కానీ తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుదల రాకెట్లా దూసుకెళ్తోందని అన్నారు. పెరిగిన ఉత్పత్తులకు అనుగుణంగా గోదాములను నిర్మించుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు 2.95 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములు ఉంటే.. ఈ 8 ఏళ్లలోనే నూతనంగా 4 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములను కొత్తగా నిర్మించుకున్నామని గుర్తుచేశారు. వైవిద్యభరితమైన వ్యవసాయానికి ఖమ్మం జిల్లా పెట్టింది పేరుగా నిలిచిందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులు దేశంలోనే కీలకపాత్ర పోషించబోతున్నాయని, ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణతో శీతల గిడ్డంగుల నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నామని వివరించారు. వ్యవసాయంలో తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు. డిసెంబరు ఆఖరులోగా రైతుబంధు సాయాన్ని జమ చేయనున్నట్లు చెప్పారు.
విత్తన భాండాగారం తెలంగాణ: అజయ్
రాష్ట్ర ఏర్పాటు తరువాత సీఎం కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్రం విత్తన భాండాగారంగా నిలిచిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఒకప్పుడు ఎరువులు, విత్తనాల కోసం రైతులు రోజుల తరబడి క్యూ లైన్లలో నిలబడే దుస్థితి ఉండేదని, కానీ తెలంగాణ ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ అలాంటి ఇబ్బందులకు చరమగీతం పాడారని గుర్తుచేశారు. నూతనంగా నిర్మించిన ఈ గోదాముల ప్రాంగణంలో రూ.2.50 కోట్లతో సీసీ రోడ్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను పండించడం ద్వారా రైతులు లాభసాటి వ్యవసాయ చేయాలని సూచించారు. ఆధునిక టెక్నాలజీతో గిడ్డంగులను నిర్మించిన సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జితేందర్రెడ్డిని మంత్రి అభినందించారు.
తెలంగాణను తీర్చిదిద్దిన ఇంజినీర్ కేసీఆర్..
నీళ్లు, ఎరువులు, కరెంటు వంటి సమస్యలకు తావివ్వకుండా తెలంగాణను తీర్చిదిద్దుతున్న ఏకైక ఇంజినీరు ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ వేద సాయిచంద్ పేర్కొన్నారు. తెలంగాణ గిడ్డంగుల సంస్థ ఎండీ జితేందర్రెడ్డి, కలెక్టర్ వీపీ గౌతమ్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరారావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, మేయర్ పునుకొల్లు నీరజ, ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, ఇతర ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు నల్లమల వెంకటేశ్వరరావు, భూక్యా గౌరి, మాలోత్ ప్రియాంక, గుత్తా రవి, కొంటెముక్కల వెంకటేశ్వర్లు, కుర్రా భాస్కర్రావు, అజ్మీరా వీరూనాయక్, లక్ష్మణ్నాయక్, బోయినపల్లి లక్ష్మణ్గౌడ్, పిన్ని కోటేశ్వరరావు, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, పగడాల నాగరాజు, మందడపు నర్సింహారావు, మందడపు సుధాకర్, మాదంశెట్టి హరిప్రసాద్, తొలుపునూరి దానయ్య, గొర్రె శ్రీనివాసరావు, జ్యోతిరెడ్డి, తీగల సతీశ్గౌడ్, వాంకుడోత్ సురేశ్, దొంతు సత్యనారాయణ, మధుసూదన్, రవీంద్రనాథ్, నర్సింహారావు, రామకృష్ణ పాల్గొన్నారు.