ఇంద్రవెల్లి, ఫిబ్రవరి 10 : కేస్లాపూర్లోని నాగోబా ఆలయంలో శుక్రవారం అర్ధరాత్రి మెస్రం వంశీయులు మహాపూజ నిర్వహించిన అనంతరం సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం 202 మంది కొత్త కోడళ్లకు పరిచయ కార్యక్రమం(బేటింగ్) నిర్వహించారు. అనంతరం పెద్దల సమక్షంలో సతీక్ దేవతను పూజించారు. నాగోబాను దర్శించుకున్న తర్వాత మెస్రం వంశీయుల కోడళ్లుగా స్వీకరించారు. అనంతరం వారికి సంప్రదాయబద్ధంగా గోవాడ్లో ప్రవేశం కల్పించారు.
మెస్రం వంశీయుల మహిళలతో కొత్తకోడళ్లు గోవాడ్లో శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. 22 కితలకు చెందిన కొత్తకోడళ్లు ఉదయం గోవాడ్ నుంచి మర్రిచెట్ల ప్రాంతంలోని కోనేరుకు వెళ్లారు. అక్కడి నుంచి బిందెలతో నీటిని తీసుకొచ్చి గోవాడ్లో ఆ జలాన్ని చల్లుతూ శుద్ధి చేశారు. అనంతరం గోవాడ్లో వారి దేవతలకు పూజలు నిర్వహించారు. 22 కితల నుంచి సేకరించిన నవ ధా న్యాలతో నైవేద్యాన్ని వండారు. అందరూ కలిసి వంటలు చేసి కితలవారీగా పంచుకున్నారు.
మెస్రం వంశీయుల మహిళలతోపాటు కొత్తకోడళ్ల ఆధ్వర్యంలో 22 కితలవారీగా అ వ్వాల్ దేవతకు దీపాలు వెలిగించి సంప్రదా య పూజలు నిర్వహించారు. నైవేద్యాన్ని స మర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంత రం ఉపవాస దీక్షలు విరమించి సామూహిక భోజనం చేశారు. కాగా.. నాగోబా ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న గోవాడ్లో మెస్రం వంశీయుల మహిళలు సంప్రదాయ పూజలు నిర్వహించారు. గోవాడ్లో బస చేసిన మహిళలు కితలవారీగా 22 పొయిలపై సామూహికంగా వంటలు చేస్తున్నారు. నైవేద్యాలు ఉంచిన వెదురు బుట్టల వద్ద దీపాలు వెలిగించి సంప్రదాయ పూజలు చేస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. గోవాడ్లో మహిళలు కుర్చొని నాగోబా చరిత్రతోపాటు మెస్రం వంశీయుల సంప్రదాయాలపై చర్చిస్తున్నారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు.